Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 22 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 22 మార్చి 2024

22 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

కొత్త టెక్ యూనిట్ స్టీగ్ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ

ఇండియన్ ఆర్మీ కొత్తగా సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్ (STEAG) పేరుతో ప్రత్యేక సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎలైట్ యూనిట్ యుద్ధభూమలో ఆధిపత్యం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో సైన్యం యొక్క నిబద్ధతను సూచిస్తుంది.

ఆధునిక యుద్ధానికి కీలకమైన తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలను పరిశోధించడం, మూల్యాంకనం చేయడం మరియు స్వీకరించడంపై స్టీగ్ యూనిట్ దృష్టి సారిస్తుంది. వీటిలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) మరియు క్వాంటం టెక్నాలజీలలో పురోగతిని అన్వేషించడం వంటివి ఉన్నాయి.

ఆర్మీ ఉపయోగించే రేడియోలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు మరియు సైనిక అనువర్తనాల కోసం 5జి మరియు 6జి నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కూడా పరిశీలిస్తుంది. భారత సైన్యం స్టీగ్‌ను సాయుధ దళాలు, విద్యాసంస్థలు మరియు భారతీయ సాంకేతిక పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించే ఒక "ప్రధాన సంస్థ"గా భావిస్తుంది.

మారుతున్న యుద్ధ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సైన్యం ద్వారా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాల్సిన అవసరాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే హైలైట్ చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ మరియు స్టార్ట్-అప్ ఇండియా సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ స్టీగ్ యూనిట్, హై-ఎండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో స్వావలంబనను పెంపొందించడంలో గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

గగన్‌యాన్ మిషన్ కోసం సఖి యాప్ అభివృద్ధి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన గగన్‌యాన్ వ్యోమగాముల కోసం సఖి పేరుతొ బహుముఖ డిజిటల్ యాప్ అభివృద్ధి చేస్తుంది. సఖి అనగా స్పేస్-బోర్న్ అసిస్టెంట్ మరియు నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్ అని అర్ధం. దీనిని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేస్తుంది.

సఖి యాప్ గగన్‌యాన్ మిషన్ కోసం వెళ్లే వ్యోమగాములు డేటాను యాక్సెస్ చేయడం, లాగ్‌లను నిర్వహించడం మరియు వారి శ్రేయస్సు గురించి తెలియజేయడంలో సహాయపడుతుంది. ఇది గగన్‌యాన్ మిషన్‌కు మరింత భద్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

సఖి యాప్ ద్వారా వ్యోమగాములు నేరుగా గగన్‌యాన్ మిషన్ యొక్క సమగ్ర లైబ్రరీని యాక్సెస్ చేయవచ్చు. ఇందులో స్పేస్‌క్రాఫ్ట్ మాన్యువల్‌లు, ప్రొసీజర్ గైడ్‌లు మరియు నిజ-సమయ టెలిమెట్రీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇది వ్యోమగాములు, ఆన్‌బోర్డ్ సిస్టమ్‌లు మరియు మిషన్ నియంత్రణ మధ్య కమ్యూనికేషన్‌ను క్రమబద్ధీకరిస్తుంది.

అంతే కాకుండా సఖి ఒక అప్రమత్తమైన ఆరోగ్య సంరక్షకునిగా కూడా పనిచేస్తుంది. వ్యోమగాములు హృదయ స్పందన రేటు, రక్తపోటు మరియు ఆక్సిజన్ సంతృప్తత వంటి ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షిస్తుంది. ఇది హైడ్రేషన్, మందులు మరియు ఆరోగ్యకరమైన నిద్ర విధానాలను నిర్వహించడం, కఠినమైన అంతరిక్ష వాతావరణంలో వ్యోమగామి శ్రేయస్సును నిర్ధారించడం కోసం సకాలంలో రిమైండర్‌లను కూడా అందిస్తుంది.

సఖి యొక్క ఏకీకరణ ఇస్రో యొక్క గణనీయమైన పురోగతిని సూచిస్తుంది, ఇది వ్యోమగామి భద్రత, మిషన్ సామర్థ్యం మరియు సాంకేతిక ఆవిష్కరణల పట్ల దాని అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది. స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఈ యాప్ విజయవంతమైన గగన్‌యాన్ మిషన్‌కు మార్గం సుగమం చేస్తుంది.

క్యూబా, రష్యాలకు కొత్త భారత రాయబారులు నియామకం

రిపబ్లిక్ ఆఫ్ క్యూబాకు భారత తదుపరి రాయబారిగా టి. ఆర్మ్‌స్ట్రాంగ్ చాంగ్సన్ మార్చి 18న నియమితులయ్యారు. దౌత్యవేత్తగా రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని కలిగి ఆయన, ఇది వరకు జపాన్, నైజీరియా మరియు దక్షిణాఫ్రికా, ఐస్‌లాండ్‌లో వివిధ దౌత్య హోదాలలో సేవలు అందించారు.

  • రిపబ్లిక్ ఆఫ్ క్యూబా ఉత్తర కరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో మరియు అట్లాంటిక్ మహాసముద్రం కలిసే చోట ఉన్న ఒక ద్విప సమూహం.
  • ఉత్తర అమెరికా పరిధిలోకి వచ్చే ఈ దేశ రాజధాని : హవానా
  • కరెన్సీ : క్యూబన్ పెసో,
  • అధికారిక భాష - స్పానిష్.
  • క్యూబా ప్రధాన మంత్రి : మాన్యుయెల్ మారెరో క్రూజ్

సీనియర్ ఐఆర్ఎఫ్ అధికారి వినయ్ కుమార్, రష్యాకు తదుపరి భారత రాయబారిగా ఎంపికయ్యారు. వినయ్ కుమార్ ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్నారు. ఈయన 1992 బ్యాచుకు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్.

  • రష్యా తూర్పు ఐరోపా మరియు ఉత్తర ఆసియాలో విస్తరించి ఉన్న ఒక దేశం.
  • రష్యా విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం.
  • రష్యా పదకొండు టైమ్ జోన్స్ పరిధిలో విస్తరించి ఉంది. ఇది పద్నాలుగు దేశాలతో భూ సరిహద్దులను పంచుకుంటుంది.
  • రష్యా ప్రపంచంలో తొమ్మిదవ అత్యధిక జనాభా కలిగిన దేశం మరియు ఐరోపాలో అత్యధిక జనాభా కలిగిన దేశం.
  • రాజధాని : మాస్కో
  • కరెన్సీ : రష్యన్ రూబుల్
  • ఖండం : యూరప్ , ఆసియా
  • అధికారిక భాష : రష్యన్
  • అధ్యక్షుడు : వ్లాదిమిర్ పుతిన్
  • ప్రధాన మంత్రి : మిఖాయిల్ మిషుస్టిన్

మార్స్‌పై పెద్ద అగ్నిపర్వతాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

అంగారక గ్రహంలోని నోక్టిస్ లాబ్రింథస్ ప్రాంతంలో ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తుగా ఉన్న భారీ అగ్నిపర్వతాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నోక్టిస్ మోన్స్ అని పిలువబడే ఈ అగ్ని పర్వతం, దాదాపు 29,600 అడుగుల (9,022 మీటర్లు) ఎత్తులో, 450 కిలోమీటర్ల విస్తీరణంలో విస్తరించబడి ఉంది.

55వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో డాక్టర్ పాస్కల్ లీ మరియు సౌరభ్ శుభం ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా సంవత్సరాలుగా మార్స్ ఉపరితలంపై దీని యొక్క విచిత్రమైన ప్రకృతి దృశ్యం శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నట్లు వీరు వెల్లడించారు.

ఈ ఆవిష్కరణకు ప్రారంభ క్లూ 2023లో పరిశోధన నుండి వచ్చినట్లు వీరు వెల్లడించారు. ఉప్పు నిక్షేపాలతో కప్పబడిన నోక్టిస్ లాబిరింథస్‌లో విస్తారమైన హిమానీనదం ఉనికి ఉన్నట్లు వీరు భావిస్తున్నారు. ఇది అంగారక గ్రహంపై నీటి సంకేతాల కోసం వెతుకుతున్న పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తించింది.

నోక్టిస్ మోన్స్ యొక్క త్రవ్వకం అంగారక గ్రహంపై కొనసాగుతున్న అన్వేషణకు నిదర్శనం. ఈ పెద్ద అగ్నిపర్వతం రెడ్ ప్లానెట్ యొక్క గతం గురించి మరియు దాని జీవితాన్ని ఆశ్రయించే సామర్థ్యం గురించి అనేక రహస్యాలను అన్‌లాక్ చేయడానికి కీని కలిగి కల్గిస్తుంది. ప్రస్తుతం అగ్ని పర్వతాలు భూమి మరియు జూపిటర్ యందు మాత్రమే కనుగొబడ్డాయి.

ఓటర్ల కోసం 'నో యువర్ క్యాండిడేట్' యాప్‌ను ప్రారంభించిన ఎన్నికల సంఘం

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటర్లను శక్తివంతం చేయడానికి, భారత ఎన్నికల సంఘం 'నో యువర్ క్యాండిడేట్ (కేవైసి)' అనే కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్‌ ఓటర్లకు తమ ఎన్నికల అభ్యర్థి కోసం తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా ఓటర్లు తమ నియోజకవర్గాల అభ్యర్థుల నేర చరిత్ర, అలాగే వారి ఆస్తులు మరియు అప్పుల గురించి తెలుసుకునే వీలు కలుగుతుంది.

ఈ కొత్త యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. 18 మార్చి 2024న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల సంఘం ఈ కేవైసి యాప్‌ను ఆవిష్కరించింది. లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాలనుకునే అభ్యర్థుల నేర నేపథ్యం, ​​ఆస్తులు, అప్పుల గురించి ఓటర్లు తెలుసుకోవాల్సిన అవసరాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నొక్కి చెప్పారు.

కేవైసి యాప్ ఓటర్లకు క్రిమినల్ పూర్వాపరాలు ఉన్న అభ్యర్థుల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఎన్నికల సంఘం నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను కఠినతరం చేసిందో. అభ్యర్థులు తప్పనిసరిగా తమ నేర చరిత్రను వార్తాపత్రికలు మరియు టెలివిజన్‌ ద్వారా మూడుసార్లు వెల్లడించాలని నిబంధన పెట్టింది.

అలానే ఇటువంటి అభ్యర్థులను నామినేట్ చేసే పార్టీలు ఇతర అర్హులైన అభ్యర్థుల కంటే వారి ఎంపికను వివరించాల్సిన నిబంధనను కూడా చేర్చింది. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందిస్తాయని భావిస్తున్నారు. ఓటర్లు తమ ఓటు వేసే ముందు అభ్యర్థుల గురించి సమగ్ర సమాచారాన్ని పొందేలా చేయడం లక్ష్యంగా ఈ చొరవ తీసుకోబడింది.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారతదేశంకు 126వ స్థానం

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భారతదేశం 126వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 20న ఈ ర్యాంకింగ్ ప్రకటించబడింది. ఈ నివేదిక ప్రకారం 7.7 సగటు స్కోరుతో ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా 7వ సారి అగ్రస్థానం దక్కించుకుంది.

ఈ జాబితాలో ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రేలియా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు లెబనాన్ దేశాలు వరుసగా 1.7 మరియు 2.7 స్కోర్‌లతో అట్టడుగు రెండు స్థానాల్లో నిలిచాయి.

ఈ నివేదిక గ్యాలప్, ఆక్స్‌ఫర్డ్ వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యూఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ మరియు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ యొక్క సంపాదకీయ బోర్డు భాగస్వామ్యం ద్వారా ప్రచురించబడుతుంది. ఇది ఐక్యరాజ్యసమితి యొక్క స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా 2012లో ప్రారంభించబడింది.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా 143 దేశాలు మరియు భూభాగాల్లోని పౌరుల జీవన ప్రమాణాలను అధ్యనం చేస్తుంది. ఆయా దేశాలలో పౌరుల ఆదాయం, ఆరోగ్యం, స్వేచ్ఛ, దాతృత్వం మరియు అవినీతి లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సున్నా నుండి పది వరకు స్కోరు అందిస్తుంది. అత్యధిక స్కోరు సాధించిన దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో చేర్చబడతయి.

  • వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ యేటా మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రచురించబడుతుంది.
  • ఈ నివేదికను యూఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్, గ్యాలప్ మరియు ఆక్స్‌ఫర్డ్ వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందిస్తాయి.
  • భారతదేశం వరుసగా రెండవ ఏడాది 126వ స్థానంలో నిలిచింది.
  • భారతదేశం యొక్క పొరుగు దేశాలన్నీ అగ్రస్థానంలో ఉన్నాయి, చైనా 60, నేపాల్ 93, పాకిస్తాన్ (108), మయన్మార్ (118) స్థానాలలో ఉన్నాయి.
  • అయితే  శ్రీలంక (128), మరియు బంగ్లాదేశ్ (129) ర్యాంకులతో భారత్ కంటే దిగువున ఉన్నాయి.

Post Comment