బీజేపీ మేనిఫెస్టో 2024 : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు
March Telugu Current Affairs

బీజేపీ మేనిఫెస్టో 2024 : కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు

2024 లోక్‌సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ పార్టీ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేసింది. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు బిజెపి చీఫ్ జెపి నడ్డా పాల్గొన్నారు.

Advertisement

మోదీ కి గ్యారెంటీ - సంకల్ప్ పత్ర పేరుతొ విడుదల చేసిన ఈ బీజేపీ పార్టీ మేనిఫెస్టో, మహిళా శక్తి, యువశక్తి, రైతులు మరియు పేదలు అనే విక్షిత్ భారత్ యొక్క నాలుగు స్తంభాలపై దృష్టి సారించింనట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన వాగ్దానాలన్ని తమ ప్రభుత్వం నెరవేర్చినట్లు పేర్కొన్నారు.

వీటిలో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి కీలక విజయాలను ఆయన హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది అభిప్రాయాల ఆధారంగా బీజేపీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పేర్కొన్నారు. తమ మేనిఫెస్టో సామాజిక న్యాయంపై దృష్టి సారిస్తూ విక్షిత్ భారత్ కోసం రోడ్‌మ్యాప్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు.

  1. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చే ఐదేళ్లు ఉచిత రేషన్.
  2. గరీబ్ కి థాలీ కార్యక్రమం కింద వచ్చే పదేళ్లు దేశీయంగా పప్పులు, తినదగిన నూనెలు మరియు కూరగాయల ఉత్పత్తి.
  3. ఆయుష్మాన్ భారత్‌ కింద ₹5 లక్షల వరకు నాణ్యమైన ఉచిత ఆరోగ్య చికిత్స కొనసాగింపు.
  4. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని కొత్త ఇల్లు మంజూరు.
  5. హర్ ఘర్ నల్ సే జల్ కార్యక్రమం కింద గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల్లోని అన్ని గృహాలకు స్వచ్ఛమైన తాగునీరు.
  6. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్.
  7. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కొనసాగింపు
  8. టాప్-టైర్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను టైర్-2 మరియు టైర్-3 నగరాలకు విస్తరణ.
  9. లఖపతి దీదీ కార్యక్రమం కింద మూడు కోట్ల గ్రామీణ మహిళలకు సాధికారత.
  10. స్వయం సహాయక బృందాలకు ఆరోగ్య సంరక్షణ, విద్య, రిటైల్ మరియు పర్యాటకం రంగాలలో నైపుణ్య శిక్షణ.
  11. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభలలో మహిళలకు ప్రాతినిథ్యం కల్పించేందుకు నారీ శక్తి వందన్ అధినియమ్‌ అమలు.
  12. మహిళల ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్‌ (అత్యవసర హెల్ప్‌లైన్ 112) మరింత బలోపేతం.
  13. దేశవ్యాప్తంగా రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో దుష్ప్రవర్తనను అరికట్టడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం కఠినంగా అమలు.
  14. ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలో సీనియర్ సిటిజన్‌లకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ.
  15. సీనియర్ సిటిజన్‌ల జ్ఞానం మరియు అనుభవాన్ని గౌరవించడానికి జాతీయ సీనియర్ సిటిజన్స్ పోర్టల్‌ అందుబాటులోకి.
  16. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ₹6,000 వార్షిక ఆర్థిక సహాయం కొనసాగింపు.
  17. పీఎం ఫసల్ బీమా యోజన మరింత బలోపేతం. వేగవంతమైన చెల్లింపులు మరియు త్వరిత ఫిర్యాదుల పరిష్కారం.
  18. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 25.5 లక్షల హెక్టార్ల నీటిపారుదల సామర్థ్యం పెంపుకు ప్రణాళిక.
  19. పంటల అంచనా వంటి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల కోసం స్వదేశీ భారత్ కృషి ఉపగ్రాహం అందుబాటులోకి.
  20. అన్ని వ్యవసాయ ఇన్‌పుట్‌లు మరియు సేవలను అందించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు.
  21. భారతీయ వ్యవసాయ భూములలో నిరంతర భూసారాన్ని పెంపొందించడానికి నానో-యూరియా అందుబాటులోకి.
  22. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కొనసాగింపు.
  23. గిగ్ వర్కర్లు & అసంఘటిత కార్మికులకు ఇ-శ్రమ్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా వివిధ ప్రయోజనాలు అందజేత.
  24. వలస కార్మికుల ప్రయాణానికి సహాయం చేయడానికి, ముఖ్యమైన సందర్భాలలో ప్రత్యేక రైలు సేవలు.
  25. వీధి వ్యాపారులకు రుణ సదుపాయాలను అందించడం కోసం పీఎం స్వనిధి పథకం కొనసాగింపు.
  26. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా జీవనోపాధిని పొందేందుకు అర్హులైన వ్యక్తులకు క్రెడిట్ సౌకర్యం.
  27. గరిమా గ్రహాస్ నెట్‌వర్క్‌ మరింత విస్తరణ. దేశవ్యాప్తంగా అర్హులైన లింగమార్పిడి వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ యోజన అమలు.
  28. చారిత్రాత్మక పౌరసత్వ సవరణ చట్టం అమలు.
  29. సౌకర్యవంతమైన రాత్రిపూట ప్రయాణం కోసం వందే స్లీపర్ రైళ్లు అందుబాటులోకి.
  30. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు కారిడార్‌ అందుబాటులోకి. ఉత్తర, దక్షిణ మరియు తూర్పు భారతదేశంలో బుల్లెట్ రైలు కారిడార్‌ల కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం.
  31. మెరుగైన కనెక్టివిటీ మరియు ఆరోగ్య సంరక్షణ, విద్య, ప్రభుత్వ సేవలు మరియు మార్కెట్‌ ప్రాప్యత కోసం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన విస్తరణ.
  32. ఆధునిక రహదారి కనెక్టివిటీ పర్యావరణ వ్యవస్థను 15,000 కి.మీ యాక్సెస్-నియంత్రిత స్థాయికి బలోపేతం. నగరాల రద్దీని తగ్గించడానికి ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం.
  33. 2047 నాటికి భారత్‌ ఇంధన స్వాతంత్య్రాన్ని సాధించేలా ప్రణాళిక.
  34. దేశంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సిఫార్సుల అమలుకు కృషి.
  35. భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సిద్ధం. భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక.

బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమం

1. గరీబ్ పరివార్ జన్

  • పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 2020 నుండి 80+ కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్‌ అందిస్తున్నారు. ఈ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
  • పీఎం జన్ ధన్ ఖాతా పథకం ద్వారా గత పదేళ్లలో 50+ కోట్ల మంది పౌరులకు బ్యాంకింగ్ సౌలభ్యం కల్పించారు.
  • ఈ ఖాతాలలో డిబిటి ద్వారా ₹34 లక్షల కోట్ల నగదు బదిలీ చేసి, పౌరులకు సాధికారత కల్పించారు.
  • 34+ కోట్ల మంది పౌరులకు ఆయుష్మాన్ భారత్ కింద ₹5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పించారు.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4+ కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించారు.
  • జల్ జీవన్ మిషన్ కింద 14+ కోట్ల కుటుంబాలకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుబాటులోకి తెచ్చారు.
  • మా సమ్మిళిత అభివృద్ధి ద్వారా 25 కోట్ల మంది పౌరులు పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది.

2. నారీ శక్తి

  • పీఎం ఉజ్వల యోజన కింద 10+ కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు.
  • ట్రిపుల్ తలాక్ అనే అనాగరిక ఆచారం రద్దు చేసి, ముస్లిం మహిళలకు రక్షణ కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించారు.
  • స్వచ్ఛ భారత్ మిషన్ కింద 11+ కోట్ల మరుగుదొడ్లు నిర్మించి, వారికి గౌరవప్రదమైన జీవితాలను అందజేశారు.
  • మిషన్ ఇంద్రధనుష్ కింద 6+ కోట్ల మంది తల్లులు మరియు పిల్లలకు టీకాలు వేశారు.
  • వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 12 నుండి 26 వారాలకు పెంచారు.
  • ఒక్క ₹1కి శానిటరీ ప్యాడ్‌లను అందుబాటులో ఉంచడం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చారు.
  • ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద 3+ కోట్ల మంది మహిళలు ప్రసూతి సేవలను పొందారు.
  • నారీ శక్తి వందన్ అధినియం చట్టం ద్వారా లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు.

3. యువతకు కొత్త అవకాశాలు

  • ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ₹27+ లక్షల కోట్ల విలువైన 46+ కోట్ల రుణాలు అందజేశారు.
  • దేశంలో కొత్తగా 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 315 మెడికల్ కళాశాలలు మరియు 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.
  • పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 1.4+ కోట్ల మంది యువకులకు నైపుణ్య శిక్షణ అందించబడింది.
  • యువత కోసం దేశంలో ప్రపంచ మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చేశారు.
  • పేపర్ లీక్‌లను నిరోధించడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ (నివారణ అన్యాయమైన మీన్స్) చట్టం 2024 ఆమోదించారు.
  •  టాప్స్ క్రింద ఒలింపిక్స్‌లో రాణించేందుకు 280 మంది అథ్లెట్లకు సౌకర్యాలు కల్పించారు.

4. కిసాన్ సమ్మాన్

  • పీఎం కిసాన్ కింద 11+ కోట్ల మంది రైతులకు ఏటా ₹6,000 వ్యవసాయ పెట్టుబడి సాయం అందజేశారు.
  • పంటలకు కనీస మద్దతు ధర ( ఎంఎస్‌పి ) అనూహ్యాంగా పెంచారు.
  • వ్యవసాయ బడ్జెట్‌ 2013 నుంచి 2024 వరకు 5 రెట్లు పెంచుతూ వచ్చారు.
  • ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 4+ కోట్ల మంది రైతులకు జీవనోపాధి కల్పించారు.
  • ₹11 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర భరోసా అందజేశారు.

5. సబ్కా సాత్ సబ్కా వికాస్

  • జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబీసీ)కి రాజ్యాంగ హోదా కల్పించారు.
  • కేంద్ర క్యాబినెట్ యందు 60% మంది ఓబీసీ, ఎస్సీ మరియుఎస్టీలకు స్థానం కల్పించారు.
  • 2014 నుండి మూడు రెట్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసారు.
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించారు.
  • విశ్వకర్మల సమగ్ర సంక్షేమం కోసం ₹13,000 కోట్ల వ్యయంతో ఇటీవలే పిఎం విశ్వకర్మ యోజన ప్రారంభించబడింది.
  • పీఎం స్వానిధి కింద 63+ లక్షల మంది వీధి వ్యాపారులకు క్రెడిట్ సౌలభ్యం కల్పించారు.
  • స్టాండ్ అప్ ఇండియా కింద 2.2+ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలు మరియు మహిళలు ₹50,000+ కోట్ల సులభ క్రెడిట్‌ని అందుకున్నారు.
  • ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికతో దేశ వ్యాప్తంగా 112 ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు 500 ఆకాంక్షాత్మక బ్లాకులపై దృష్టి సారించారు.
  • బలహీన గిరిజన సమూహాల కోసం రూ.24,000+ కోట్లతో ప్రధానమంత్రి జన్మన్ యోజన ప్రారంభించబడింది.
  • 662 సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ₹4,800 కోట్లతో వైబ్రంట్ విలేజెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • అసంఘటిత కార్మికులకు భరోసా కల్పించడం కోసం ప్రాథమిక సామాజిక భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసారు.
  • ఇ-శ్రమ్ పోర్టల్ ద్వారా గుర్తింపు కల్పిస్తూ అటల్ పెన్షన్ యోజన, పీఎం శ్రమయోగి మంధన్ యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటివి అమలు చేసారు.

6. సురక్షిత్ భారత్

  • 2014 నుండి ఏ నగరంలోను పెద్ద ఉగ్రదాడులు జరగలేదు.
  • ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో హింస గణనీయంగా తగ్గింది.
  • వామపక్ష తీవ్రవాద-సంబంధిత హింసలో 52% తగ్గుదల.
  • ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు సంబంధిత హింస 71 శాతం తొలగిపోయింది.
  • శిక్షలకు బదులు న్యాయంపై దృష్టి సారించే భారతీయ న్యాయ సంహితను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.

7. విరాసత్ భీ, వికాస్ భీ

  • ఐదు శతాబ్దాల ప్రజల కల అయోధ్యలో రామమందిరం సాకారమైంది.
  • పురాతన కాశీ విశ్వనాథ దేవాలయం, శ్రీ ఉజ్జయిని మహాకాళ్ దేవాలయం మరియు శ్రీ కేదార్‌నాథ్ దేవాలయం వంటివి పునరుద్ధరించబడ్డాయి.
  • భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ్ దివస్‌ని ఏర్పాటు చేశారు.
  • దేశ వ్యాప్తంగా 10 ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంలు ఏర్పాటు చేయబడ్డాయి.
  • ఇండియా గేట్ పందిరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
  • సైనిక అమరవీరుల గౌరవార్థం కొత్త నేషనల్ వార్ మెమోరియల్ మరియు కొత్త నేషనల్ పోలీస్ మెమోరియల్ నిర్మాణం.

8. బలమైన ఆర్థిక వ్యవస్థ & మౌలిక సదుపాయాల అభివృద్ధి

  • టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆర్థిక వ్యవస్థ.
  • తయారీ రంగం ప్రోత్సహించడం కోసం జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా మరియు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప్రవేశపెట్టబడింది.
  • మౌలిక సదుపాయాల సమీకృత ప్రణాళిక కోసం పీఎం గతి శక్తి పోర్టల్‌ ప్రారంభం.
  • దేశ వ్యాప్తంగా ప్రతిరోజు 28 కి.మీ జాతీయ రహదారులు నిర్మణం.
  • ప్రతిరోజూ 14.5 కి.మీ రైల్వే లైన్ల నిర్మణం, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ల అభివృద్ధి మరియు 1,300+ రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి.
  • 20+ నగరాలలో మెట్రో సేవల విస్తరణ.
  • ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గ్రామాల్లో 3.7 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి.
  • మానవ రహిత రైల్వే క్రాసింగ్‌ల తొలగింపు.
  • దేశంలోని పోర్టుల సామర్థ్యం రెట్టింపు.
  • భారతదేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు.
  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్, నమో భారత్ మరియు ఇతర కొత్త యుగం రైళ్ల ప్రారంభం.
  • నాన్-ఫాసిల్ ఇంధన శక్తి సామర్థ్యాన్ని 2.5 రెట్లు పెంచి 180 గిగా వాట్లకు పెరిగింది.
  • సౌభాగ్య పథకం కింద 2.8+ కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్ అందించడం ద్వారా 100% విద్యుదీకరణ సాధించారు.
  • రోడ్లు, వంతెనల విస్తరణ ద్వారా ఈశాన్య కనెక్టివిటీలో అపూర్వమైన మెరుగుదల. అలానే రైల్వేలు మరియు విమానాశ్రయాలు అందుబాటులోకి.
  • అత్యంత సరసమైన ధరలతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్ అందించబడుతుంది.

9. గ్లోబల్ స్టేజ్‌లో భారత్

  • వివిధ మిషన్ల ద్వారా ఆపద పరిస్థితుల్లో ఉన్న 1.5+ కోట్ల మంది పౌరులను సురక్షితంగా  స్వదేశానికి తీసుకొచ్చారు.
  • చారిత్రాత్మకమైన జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించింది, ఢిల్లీ డిక్లరేషన్ చేశారు.
  • గత పదేళ్లలో భారత్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్‌గా అవతరించింది.
  • యూపీఐతో సహా డిజిటల్ ఇండియా స్టాక్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.
  • 27 భాగస్వామ్య దేశాలతో ఇండియన్ రూపాయిలో ట్రేడింగ్ ప్రారంభమైంది.
  • ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధికి భారత్ నాయకత్వం వహిస్తుంది.
  • టీకా మైత్రి కార్యక్రమం ద్వారా 100 దేశాలకు 30+ కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్‌లు మరియు మందులు పంపిణి.
  • హిందూ మహాసముద్రంలో నావిగేషన్ స్వేచ్ఛ మరియు సముద్ర భద్రతకు భరోసా.
  • చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర విజయవంతంగా దిగిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది.
  • భారత్ చొరవతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.
  • భారత్ చొరవతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం శ్రీ అన్నను ప్రపంచానికి పరిచయం చేసింది.

Advertisement

Post Comment