Advertisement
టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ 2022
Scholarships

టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ 2022

స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) చెందిన విద్యార్థులకు, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన టాప్ క్లాస్ యూనివర్సిటీలు మరియు ఇనిస్టిట్యూట్లలో పూర్తిస్థాయి రెసిడెన్సియల్ టైపు ఉన్నత విద్య అందిస్తారు.

ఈ స్కాలర్షిప్ 2005-06 విద్యా సంవత్సరం నుండి  అందిస్తున్నారు. ఈ స్కీమ్ అన్ని రకాల గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా కోర్సులకు వర్తింపజేస్తారు. ప్రతిభావంతులైన నిరుపేద ఎస్సీ విద్యార్థులను గౌరవనీయమైన స్థాయిలో నిలబెట్టలనే ఉద్దేశ్యంతో దీన్ని అమలుచేస్తున్నారు.

స్కాలర్షిప్ పేరు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్
ఎవరు అర్హులు వార్షిక కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు ఉండే ఎస్సీ విద్యార్థులు
దరఖాస్తు ముగింపు తేదీ 31-10-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 15-11-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 15-11-2022

ఈ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా 4200 మంది ఎస్సీ విద్యార్థులకు అందజేస్తారు. ఇందులో 30 శాతం సెట్లు ఎస్సీ మహిళా విద్యార్థులకు కేటాయిస్తారు. వారు అందుబాటులో లేని సమయంలో అర్హులైన పురుషులకు కేటాయిస్తారు. ఈ స్కాలర్షిప్'కు అర్హుత పొందిన విద్యార్థులకు మైంటెనెన్సు అలోవెన్సు, ఫీజు రీయింబర్సమెంట్, బుక్ గ్రాంట్ అమౌంట్, స్పెషల్ అలోవెన్సు మరియు ఇతర ఖర్చుల కోసం స్పెషల్ గ్రాంట్స్ అందిస్తారు. వీటిని విద్యార్థి యొక్క కోర్సు వ్యవధి ఆధారంగా రెండు నుండి ఐదేళ్ల వరకు అందిస్తారు. ఒక సారి స్కాలర్షిప్'కు ఎంపికయితే, దాన్ని కోర్సు పూర్తియ్యే వరకు అమలుచేస్తారు.

ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఇండియన్ టాప్ 100 ర్యాంకులలో ఉండే విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అందిస్తారు. ఈ జాబితాలో అన్ని IIM లు / IIT లు / IIIT లు / AIIMS లు / NIT లు / NIFT లు / NID లు / ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఉన్నాయి. అంతే కాకుండా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు కలిగిన (NAAC) A ++ మరియు A + అక్రెడిటెడ్ ఇనిస్టిట్యూషన్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

Components of scholarship Rate for Awadree
 ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వ ఇనిస్టిట్యూట్లలో చేరే విద్యార్థులకు గరిష్టంగా 2 లక్షలు, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో చేరే విద్యార్థులకు 3.7 లక్షలు అందిస్తారు.
మెంటెనన్స్ అలోవెన్సు నెలకు 3,000/-
బుక్స్ & స్టేషనరీ ఏడాదికి 5 వేలు
కంప్యూటర్ మరియు సంబంధిత వస్తువులు కొనుక్కునేందుకు రీయింబర్స్‌మెంట్ 45 వేలు (వన్ టైమ్ గ్రాంట్)

ఎవరు అర్హులు

వార్షిక కుటుంబ ఆదాయం 8 లక్షలలోపు ఉండి, టాప్ మెరిట్ కలిగిన ఎస్సీ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసే ముందు విద్యార్థి, కుల ధ్రువీకరణ, బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, అకాడమిక్ సర్టిఫికెట్, ఫొటోగ్రాఫ్, ఫీజు రిసిప్టులు మరియు ఆధార్ కార్డు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

ఈ స్కాలర్షిప్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి దరఖాస్తు నోటిఫికేషన్ స్థానిక వార్తాపత్రికల్లో మరియు న్యూస్ ఛానెళ్లలో పబ్లిష్ చేస్తారు. అర్హుత ఉండే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం నియమింపబడిన స్టీనింగ్ కమిటీ దరఖాస్తు పరిశీలించి, అర్హులను గుర్తిస్తుంది. దరఖాస్తుల వెరిఫికేషన్ అనంతరం, వీరి సిపార్సు మేరకు స్కాలర్షిప్ ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థులు ప్రభుత్వం గుర్తించిన విద్య సంస్థల్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే ఈ పథకాన్ని అమలుచేసారు. మొదటి ఏడాది అకాడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని విద్యార్థులకు ఈ పథకం నిలిపివేయబడుతుంది.

అందుబాటులో ఉండే స్కాలర్షిప్'లలో 30 శాతం బాలికలకు రిజర్వ్ చేయబడి ఉంటాయి. అలానే ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అందిస్తారు. ఈ పథకం పరిధిలో గరిష్టంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి టాప్ 4200 మందికి అవకాశం కల్పిస్తారు.

Post Comment