Advertisement
తెలుగు డైలీ కరెంట్ అఫైర్స్ : 04 July 2023 Current Affairs
Telugu Current Affairs

తెలుగు డైలీ కరెంట్ అఫైర్స్ : 04 July 2023 Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 04 జులై 2023 కరెంట్ అఫైర్స్ అంశాలు తెలుగులో చదవండి. ఇవి వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

డబ్ల్యుటిఓ భారత రాయబారిగా బ్రజేంద్ర నవనిత్ కొనసాగింపు

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్ యొక్క భారత రాయబారిగా బ్రజేంద్ర నవనిత్ పదవీకాలాన్ని పొడిగించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బ్రజేంద్ర నవ్‌నిత్, జూన్ 2020లో ప్రపంచ వాణిజ్యా సంస్థకు భారత రాయబారి మరియు శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. తమిళనాడు కేడర్‌కు చెందిన బ్రజేంద్ర నవనిత్,  1999 బ్యాచుకు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే మరియు సులభతరం చేసే ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో ఒక భాగం. దీనిని 1995లో స్థాపించారు. ఇది ప్రస్తుతం 164 మంది సభ్యులను కలిగి ఉంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా దేబదత్తా చంద్

బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా దేబదత్తా చంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకానికి ముందు ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్, ట్రెజరీ & గ్లోబల్ మార్కెట్‌లు, మిడ్-కార్పోరేట్ బిజినెస్ మరియు ట్రేడ్ & ఫారిన్ ఎక్స్‌ఛేంజ్‌ల పర్యవేక్షుడుగా విధులు నిర్వర్తించారు.

చంద్ 1994లో అలహాబాద్ బ్యాంక్‌ నుండి అధికారిగా తన బ్యాంకింగ్ వృత్తిని ప్రారంభించారు. 1998 నుండి 2005 వరకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిచారు. 2005లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో చీఫ్ మేనేజర్‌గా చేరి చీఫ్ జనరల్ మేనేజర్ స్థానానికి చేరుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 15 ఏళ్లకు పైగా ఈయన సేవలందించారు.

ఐడిఎఫ్‌సి లిమిటెడ్‌లో విలీనమైన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు

ఐడిఎఫ్‌సి లిమిటెడ్‌లో విలీనానికి బోర్డు గ్రీన్ లైట్ ఇచ్చినట్లు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. ఐడిఎఫ్‌సి ఎఫ్‌హెచ్‌సిఎల్, ఐడిఎఫ్‌సి లిమిటెడ్ మరియు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లను ఏకీకృతం చేయడం ద్వారా కార్పొరేట్ నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి ఈ విలీనం దారి తీస్తుంది. రెండు కంపెనీల మధ్య సమ్మేళనాల కారణంగా సంయుక్త సంస్థ బలమైన ఆర్థిక పనితీరును కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఐడిఎఫ్‌సి యొక్క ప్రతి 100 ఈక్విటీ షేర్లకు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ యొక్క 155 ఈక్విటీ షేర్ల షేర్ ఎక్స్ఛేంజ్ రేషియో జరగనుంది. మార్చి 2024 నాటికి ఈ విలీనం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ విలీనం ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మరియు ఐడిఎఫ్‌సి లిమిటెడ్ షేర్‌హోల్డర్‌లకు షేర్‌హోల్డర్ విలువను అన్‌లాక్ చేస్తుందని భావిస్తున్నారు.

పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను జపనీస్ వ్యాపారవేత్త రుకో హిరా ఆర్థిక సహాయంతో భారతీయ మహిళా ఓపెన్ చాంపియన్ నాళం గాంగులక్ష్మి ఏర్పాటు చేసారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన మోడీ, ఈ సెంటర్ ఆధ్యాత్మికత, సాంస్కృతిక మార్పిడి మరియు ప్రపంచ శాంతి కోసం ఒక కేంద్రంగా ఉంటుందని అన్నారు. సాయి హిరా గ్లోబల్ కాన్వెన్షన్ సెంటర్‌ను శ్రీ సత్య సాయి బాబా జీవితం మరియు ఆయన సేవలను ప్రపంచానికి తెలియజేయడానికి ఒక అవకాశంగా ఉపయోగించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

సాయి హిరా గ్లోబల్ కాన్వెన్షన్ సెంటర్ 1,000 మంది సమావేశమయ్యే సామర్థ్యంతో నిర్మించారు. ఇది ప్రపంచ-స్థాయి సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాలతో సమావేశాలు, సెమినార్లు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందులో విశాలమైన కాంప్లెక్స్‌తో సహా ధ్యాన మందిరాలు, నిర్మలమైన తోటలు మరియు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఎఫ్‌డిఐ డ్రైవ్‌ను ప్రోత్సహించడానికి యుఎఇలో పెట్టుబడి మంత్రిత్వ శాఖ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్తగా పెట్టుబడి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. యుఎఇ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జూలై 3, 2023న ఈ మంత్రిత్వ శాఖను ప్రకటించారు.

యూఏఈ యొక్క పెట్టుబడి వ్యూహాన్ని దేశీయంగా మరియు అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం ఈ కొత్త మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. యుఎఇలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ఆకర్షించడం మరియు పెట్టుబడులకు గమ్యస్థానంగా దేశాన్ని ప్రోత్సహించేందుకు కూడా ఇది బాధ్యత వహిస్తుంది.

ఈ మంత్రిత్వ శాఖకు గతంలో యూఏఈ ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేసిన మహమ్మద్ హసన్ అల్ సువైదీ నేతృత్వం వహిస్తారు. అల్ సువైదీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ మరియు ఆర్థిక రంగంలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.

పెట్టుబడి మంత్రిత్వ శాఖ స్థాపన అనేది ఎఫ్‌డిఐని ఆకర్షించడానికి మరియు దాని ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడానికి యుఎఇ నిబద్ధతకు సంకేతం. యుఎఇ ఇప్పటికే ఎఫ్‌డిఐకి ప్రధాన గమ్యస్థానంగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఆ దేశం మరింత పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ కొత్త మంత్రిత్వ శాఖ సహాయపడుతుందని భావిస్తున్నారు.

బీహార్‌లో 205 రకాల పక్షుల జాతులు గుర్తింపు

బీహార్ అటవీ శాఖ మరియు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలో బీహార్ రాష్ట్రంలో 205 రకాల పక్షుల జాతులు ఉన్నట్లు వెల్లడి అయ్యింది. ఇది 2022లో మునుపటి జనాభా లెక్కల కంటే 3 జాతుల పెరుగుదలను సూచిస్తుంది.

జనవరి-ఫిబ్రవరి 2023లో ఈ పక్షుల జనాభా గణన నిర్వహించబడింది. ఈ గణన బీహార్‌లోని 26 జిల్లాల్లోని 76 చిత్తడి నేలలను కవర్ చేసింది. సర్వే చేయబడిన చిత్తడి నేలలలో గంగా, కోసి మరియు గండక్ నదీ వ్యవస్థలు ఉన్నాయి. ఈ జనాభా గణనలో కనిపించే అత్యంత సాధారణ పక్షి జాతులలో సాధారణ క్రేన్, బార్-హెడెడ్ గూస్ మరియు పెయింటెడ్ కొంగ. ఇతర ముఖ్యమైన జాతులలో లెస్సర్ ఫ్లోరికాన్, సారస్ క్రేన్ మరియు వైట్-రంప్డ్ రాబందులు ఉన్నాయి.

బీహార్‌లో పక్షి జాతుల సంఖ్య పెరగడం రాష్ట్ర వన్యప్రాణులకు సానుకూల సంకేతం. బీహార్‌లోని చిత్తడి నేలలు ఆరోగ్యవంతంగా ఉన్నాయని మరియు వివిధ రకాల పక్షి జాతులకు అనువైన ఆవాసాన్ని అందిస్తాయని ఇది సూచిస్తుంది. బీహార్ అటవీ శాఖ మరియు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ 2024లో రాష్ట్రంలో పక్షుల జనాభాలో మార్పులను తెలుసుకోవడానికి మరో పక్షి గణనను నిర్వహించాలని యోచిస్తున్నాయి.

భారతదేశంలో హై-ఎండ్ సర్వర్‌ల తయారీని ప్రారంభించిన హెచ్‌పిఈ

హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ జూలై 4, 2023న భారతదేశంలో హై-ఎండ్ సర్వర్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హర్యానాలోని మనేసర్‌లో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి కంపెనీ భారతీయ తయారీదారు వీవీడిఎన్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

హెచ్‌పిఈ, భారతదేశంలో మొదటి ఐదు సంవత్సరాలలో సుమారు $1 బిలియన్ విలువైన హై-రన్నర్ సర్వర్‌లను తయారు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో ఉత్పత్తి చేయాలనే ఈ నిర్ణయం దేశం పట్ల ఉన్న దీర్ఘకాలిక నిబద్ధత మరియు పెరుగుతున్న ఐటీ మార్కెట్‌కు ప్రతిబింబమని కంపెనీ పేర్కొంది.

ఈ చర్య దేశానికి విదేశీ పెట్టుబడులు మరియు తయారీని ఆకర్షించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమానికి ప్రోత్సాహకంగా కూడా పరిగణించబడుతుంది. ఇటీవలి నెలల్లో భారతదేశంలో తయారీకి ప్రణాళికలు ప్రకటించిన విదేశీ టెక్ కంపెనీ హెచ్‌పిఈ మాత్రమే కాదు. మే 2023లో, యాపిల్ కర్ణాటకలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 2023లో, కొత్త డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి భారతదేశంలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

ఈ పెట్టుబడులు భారత ఐటీ మార్కెట్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతకు సంకేతం. భారతదేశంలో అత్యాధునిక సర్వర్‌ల తయారీ దేశ ఐటీ పరిశ్రమకు గణనీయమైన అభివృద్ధిని తెచ్చిపెడుతుంది. ఇది ఉద్యోగాలను సృష్టిస్తుంది, ఎగుమతులను పెంచుతుంది మరియు ఐటీ తయారీకి భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడానికి సహాయపడుతుంది.

హ్యూలెట్-ప్యాకర్డ్ (HP) అనేది కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అమెరికన్ బహుళజాతి సమాచార సాంకేతిక సంస్థ. ఇది అనేక రకాల హార్డ్‌వేర్ భాగాలను అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తుంది. అలాగే వినియోగదారులు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు మరియు ప్రభుత్వలకు, ఆరోగ్య మరియు విద్యా రంగాలలోని కస్టమర్‌లతో సహా పెద్ద సంస్థలకు సాఫ్ట్‌వేర్ మరియు సంబంధిత సేవలను అందిస్తుంది.

వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి శ్రీలంక బ్యాటర్‌గా చమరి అతపత్తు

శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ చమరి అతపత్తు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి శ్రీలంక మహిళగా చరిత్ర సృష్టించింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు అజేయ సెంచరీలు చేయడంతో ఆమె ఈ ఘనత సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో అతపత్తు 108 పరుగులు చేసి శ్రీలంకను తొమ్మిది వికెట్ల తేడాతో గెలిపించింది. మూడవ వన్డేలో కేవలం 80 బంతుల్లో 140 పరుగులతో అజేయంగా నిలిచింది.

అతపత్తు యొక్క ఈ రెండు సెంచరీలు ఆమెకు ర్యాంకింగ్స్‌లో ఆరు స్థానాలు ఎగబాకడానికి సహాయపడ్డాయి. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీని అధిగమించి అగ్రస్థానం దక్కించుకుంది. ఆమె ఇప్పుడు 825 పాయింట్లను కలిగి ఉంది. ఇది మూనీ కంటే 13 పాయింట్లు ఎక్కువ. అతపత్తు ఎడమచేతి వాటం బ్యాటర్, ఆమె శక్తివంతమైన హిట్టింగ్‌కు పేరుగాంచింది. ఆమె వన్డే కెరీరులో ఎనిమిది సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు చేసింది. ఆమె ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా.

యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును పెంచిన జె & కె ప్రభుత్వం

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65కి పెంచింది. జూలై 3, 2023న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూ మరియు కాశ్మీర్‌లోని విశ్వవిద్యాలయాలలో అర్హత కలిగిన మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులను కొనసాగించాల్సిన ఆవశ్యకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పదవీ విరమణ వయస్సును పొడిగించడం ద్వారా అకడమిక్ రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతులను కొనసాగించే అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్‌లోని యూనివర్సిటీ ప్రొఫెసర్ల సంఘం స్వాగతించింది. రిటైర్‌మెంట్‌ వయస్సు పెంపుదల ఈ ప్రాంతంలోని యూనివర్సిటీల్లో విద్య నాణ్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని ఈ అసోసియేషన్‌ పేర్కొంది.

కొత్త పదవీ విరమణ వయస్సు జూలై 1, 2023 నుండి అమల్లోకి వస్తుంది. అంటే జూలై 1, 2023న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేయాల్సిన యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇప్పుడు 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పనిలో కొనసాగగలరు.

2023లో రికార్డు స్థాయిలో భూమి, సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుదల

2023లో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో భూమి మరియు సముద్ర ఉష్ణోగ్రతలు నమోదు కబడ్డాయి. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం, 2023 జనవరి నుండి జూన్ వరకు సగటు భూ ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వపు బేస్‌లైన్ కంటే 1.41°C ఎక్కువగా నమోదు కాబడింది. 1880లో ఈ రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఏ సంవత్సరంలోనైనా మొదటి ఆరు నెలల్లో ఇదే అత్యధికం.

ఆర్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం జూన్‌లో రికార్డులో రెండవ-అత్యల్పంగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ నివేదించింది. ఇది వేడెక్కుతున్న ఆర్కిటిక్ యొక్క సంకేతం, ఇది భూమిపై అత్యంత వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాలలో ఒకటి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ మార్పుల ప్రభావాలకు స్పష్టమైన సంకేతం. విపరీతమైన శిలాజ ఇంధనాల దహనం వాతావరణంలోకి గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది, ఇవి భూమి యొక్క ఉష్ణోగ్రతలను ఏటా పెంచుకుంటూ పోతున్నాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూగోళంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ వేడి తరంగాలు, కరువులు, వరదలు మరియు అడవి మంటలు వంటి మరింత తీవ్రమైన వాతావరణ సంఘటనలకు కారణమవుతున్నాయి. హిమానీనదాలు మరియు సముద్రపు మంచును కూడా కరిగిస్తున్నాయి. ఈ ప్రభావం సముద్ర మట్టాలను పెంచుతుంది.

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి ప్రపంచం తక్షణ చర్య తీసుకోవాలి. లేకపోతే, పరిణామాలు విపరీతంగా ఉంటాయి. రికార్డు స్థాయిలో భూమి మరియు సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనుభవించబడుతున్నాయి. ఈ ఉద్గారాలను తగ్గించేందుకు మనం చర్యలు తీసుకోకపోతే అవి మరింత దిగజారిపోతాయి.

కెరీర్ తోలి ఏటీపీ డబుల్స్ టైటిల్‌ గెలుచుకున్న యుకీ భాంబ్రీ

భారత టెన్నిస్ ఆటగాడు యుకీ భాంబ్రీ ఏటీపీ వరల్డ్ టూర్‌లో తన తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు లాయిడ్ హారిస్‌తో కలిసి భాంబ్రీ మల్లోర్కా ఛాంపియన్‌షిప్‌లో డబుల్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం ద్వారా ఈ ఫిట్ సాధించాడు.

భాంబ్రీ మాజీ టాప్-100 సింగిల్స్ ఆటగాడు, అయితే ఇటీవలి సంవత్సరాలలో అతను గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. 2022 నుండి డబుల్స్‌పై దృష్టి సారించాడు. భాంబ్రీ ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ ర్యాంకింగులో 58వ స్థానంలో ఉన్నాడు.

2012 ప్యారిస్ మాస్టర్స్‌ను రోహన్ బోపన్న మరియు జీవన్ నెదుంచెజియన్ గెలిచిన తర్వాత ఏటీపీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడుగా భాంబ్రీ నిలిచాడు. లియాండర్ పేస్ 2013 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తర్వాత గ్రాస్‌పై ఏటీపీ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు కూడా నిలిచాడు.

డిఎంఎ అదనపు కార్యదర్శిగా వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్‌కు బాధ్యతలు

వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ జూలై 03, 2023 న సైనిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని గతంలో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి నిర్వహించారు. ఆయన ఫిబ్రవరి 28, 2023న పదవీ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలు వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్‌కు అప్పగించబడాయి.

వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ జనవరి 01, 1988న భారత నావికాదళం యొక్క కార్యనిర్వాహక శాఖలో తన కెరీర్ ప్రారంభించారు. ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. వైస్ అడ్మిరల్ అతుల్ అతి విశిష్ట సేవా పతకం మరియు విశిష్ట సేవా పతకం గ్రహీత కూడా, ఈయన తన కెరీర్‌లో టార్పెడో రికవరీ వెసెల్ INTRV A72 కమాండ్‌తో సహా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు.

తెలంగాణ 9 ఏళ్ళ వేడుకలను పురస్కరించుకుని పోస్టల్ కవర్‌ ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ప్రారంభించారు. ఈ పోస్టల్ కవర్‌లో రాష్ట్ర చిహ్నం మరియు "తెలంగాణ రాష్ట్ర అవతరణ 9 సంవత్సరాలు" అనే పదాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పోస్టల్ డిపార్ట్‌మెంట్ డాక్ సదన్‌లో దీన్ని విడుదల చేశారు.

గడిచిన 9 ఏళ్లలో రాష్ట్రం సాధించిన విజయాలను చాటిచెప్పేందుకు పోస్టల్‌ కవర్‌ ఓ మార్గమని రెడ్డి అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం సహా అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన ప్రగతిని సాధించిందని చెప్పారు. రాష్ట్ర పౌరులకు సుపరిపాలన అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ పోస్టల్ కవర్ ధర ₹50/-. తెలంగాణలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటుంది. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

పోస్టల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోస్టల్ శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనికి పాఠశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ముంబైలో జీ20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్‌ మీటింగ్

ముంబై జీ20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ సమ్మిట్ మరియు రీసెర్చ్ మంత్రుల సమావేశానికి జూలై 4-5 తేదీల్లో ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమ్మిట్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. జీ20 పరిశోధన మంత్రుల సమావేశంకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు.

రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ సమ్మిట్ ఈక్విటబుల్ సొసైటీ కోసం పరిశోధన మరియు ఆవిష్కరణ" అనే అంశంపై దృష్టి సారించింది. పరిశోధన మరియు ఆవిష్కరణల ప్రయోజనాలను అన్ని దేశాలు మరియు సమాజాలు సమానంగా పంచుకునేలా చేసే మార్గాలను ఈ సమావేశం చర్చించింది. జీ20 పరిశోధన మంత్రుల సమావేశం జీ20 సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ యాక్షన్ ప్లాన్ 2021-2024 అమలుపై దృష్టి సారించింది.

ఈ సమావేశాలకు జీ20 దేశాలు, ఆహ్వానిత అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాలు పరిశోధన మరియు ఆవిష్కరణలపై ఆలోచనలు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడానికి ప్రతినిధులకు అవకాశాన్ని కల్పించాయి.

ఈసారాస్ మొబైల్ యాప్‌ ప్రారంభం

స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం దీనదయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఈసారాస్ (eSARAS) అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించాయి. ఈ యాప్ ఎస్‌హెచ్‌జి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఒక వేదికను అందిస్తుంది.

eSARAS యాప్‌ను ఫౌండేషన్ ఆఫ్ రూరల్ వాల్యూ చైన్స్ అభివృద్ధి చేసింది. ఇది వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్, ఇది ఎస్‌హెచ్‌జిలు తమ ఉత్పత్తులను నమోదు చేసుకోవడానికి, ఉత్పత్తి చిత్రాలు మరియు వివరణలను అప్‌లోడ్ చేయడానికి మరియు ఆర్డర్‌లను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. యాప్ కొనుగోలుదారులు ఎస్‌హెచ్‌జిలచే తయారు చేయబడిన ఉత్పత్తులను బ్రౌజ్ చేయగల మరియు కొనుగోలు చేయగల మార్కెట్‌ప్లేస్‌ను కూడా అందిస్తుంది.

ఎస్‌హెచ్‌జిల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇసారస్ యాప్‌ను ప్రారంభించడం ఒక పెద్ద ముందడుగు. దేశం నలుమూలల నుండి కొనుగోలుదారులతో ఎస్‌హెచ్‌జిలను కనెక్ట్ చేయడానికి యాప్ సహాయం చేస్తుంది మరియు ఇది 'వోకల్ ఫర్ లోకల్' స్ఫూర్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం అనేది పేదలకు ఉపాధి ఆధారిత నైపుణ్యా శిక్షణ అందించడం ద్వారా వారి జీవితాలను ఎరుగుపర్చే ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఈ పథకం కోసం భారత ప్రభుత్వం ₹500 కోట్లు కేటాయించింది. 2016 నుండి పట్టణ ప్రాంతాల్లో ఏటా 0.5 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం.

నెక్స్ట్-జెన్ వైర్‌లెస్‌ సహకారం కోసం భారత్ 6జీ అలయన్స్ ప్రారంభం

6జీ సాంకేతికత అభివృద్ధిలో ఆవిష్కరణ మరియు సహకారాన్ని అందించడం కోసం భారత ప్రభుత్వం భారత్ 6జీ అలయన్స్ (B6GA)ని ప్రారంభించింది. ఈ కూటమిని కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ జూలై 3, 2023న ప్రారంభించారు.

B6GA అనేది ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీలు, విద్యాసంస్థలు మరియు పరిశోధనా సంస్థలతో కూడిన సహకార వేదిక. దేశం మరియు ప్రపంచ అవసరాలను తీర్చగల 6G సాంకేతికతను అభివృద్ధి చేయడానికి భారతదేశంలోని ఉత్తమ మేధాస్సులను ఒకచోట చేర్చడం ఈ కూటమి లక్ష్యం.

6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భారతదేశానికి B6GA ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం ముందంజలో ఉందని మరియు 6జీ తీసుకువచ్చే ఆర్థిక మరియు సామాజిక అవకాశాల నుండి ప్రయోజనం పొందుతుందని నిర్ధారించడానికి ఈ కూటమి సహాయపడుతుంది.

B6GA వ్యవస్థాపక సభ్యుల జాబితాలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఐఐటీ బొంబాయి, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు వోడాఫోన్ ఐడియా వంటివి ఉన్నాయి.

యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చను ప్రారంభించిన పార్లమెంటరీ కమిటీ

యూనిఫాం సివిల్ కోడ్ సమస్యపై చర్చించడానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ లా అండ్ జస్టిస్, జూలై 3, 2023న చర్చలు ప్రారంభించింది. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నాయి.

యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారతదేశంలో వివాదాస్పదమైన అంశం, ఇది మత విశ్వాసాలపై ఆధారపడిన వ్యక్తిగత చట్టాల ప్రస్తుత వ్యవస్థను భర్తీ చేస్తుంది. యూసీసీ అనేది లౌకికవాదం మరియు లింగ సమానత్వానికి ఒక ముందు అడుగు అని కొందరు నమ్ముతున్నారు. మరికొందరు అది మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని నమ్ముతున్నారు.

ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాబోయే నెలల్లో యుసిసిపై వరుస సమావేశాలను నిర్వహించాలని భావిస్తుంది. ఈ కమిటీ మత పెద్దలు, న్యాయవాదులు మరియు కార్యకర్తలతో సహా వివిధ సమూహాల సభ్యుల అభిప్రాయాలను వింటుంది. ఈ కమిటీ యూసీసీ యొక్క లాభాలు మరియు నష్టాలను చర్చిస్తుంది. తన నివేదికను వచ్చేనెలలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

యూసీసీ అనుకూల వాదనలు : యూసీసీ లింగ సమానత్వం మరియు లౌకికవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థను సులభతరం చేస్తుంది. మరియు పౌరులందరికీ ఏక రూప ప్రభుత్వ పాలనను అందుబాటులోకి తీసుకొస్తుంది. చట్టంలో సమానత్వం మరియు ఏకరూపతను ప్రోత్సహిస్తుంది. మహిళల హక్కుల పరిరక్షణకు దోహదపడుతుంది.

యూసీసీ వ్యతిరేఖ వాదనలు : యూసీసీ మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుంది. ఇది భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని నాశనం చేస్తుంది. దీన్ని అమలు చేయడం మరియు అనుచరించడం కష్టతరం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశానికి ఇది సరిపోదు.

Post Comment