Advertisement
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 12 August 2023 Current Affairs
Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 12 August 2023 Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 12 ఆగష్టు 2023 పొందండి. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. ఇవి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

తెలంగాణాలో తోలి అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్  ప్రారంభం

తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు భారతదేశపు మొట్టమొదటి అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్ (ఎడిఎక్స్) మరియు అగ్రికల్చర్ డేటా మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (ఎడిఎంఎఫ్) ని ప్రారంభించారు.

ఎడిఎక్స్ అనేది రైతులు, పరిశోధకులు మరియు ఇతర వాటాదారుల మధ్య వ్యవసాయ డేటాను పంచుకోవడానికి వీలు కల్పించే వేదిక. ఇది రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మధ్య సహకారంతో పని చేయనుంది.

ఎడిఎక్స్ రైతులు, వాతావరణ కేంద్రాలు, భూసార పరీక్ష ల్యాబ్‌లు మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో సహా వివిధ వనరుల నుండి డేటాను సేకరిస్తుంది. ఈ డేటా సురక్షిత పోర్టల్ ద్వారా రైతులు, పరిశోధకులు మరియు ఇతర వాటాదారులకు అందుబాటులో ఉంచబడుతుంది.

రైతులు తమ పంటల గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎడిఎక్స్ సహాయం చేస్తుంది. ఉదాహరణకు, రైతులు తమ ప్రాంతంలో పండించడానికి ఉత్తమమైన పంటలు, ఎంత ఎరువులు వేయాలి మరియు తమ పంటలకు నీరు పెట్టడానికి సరైన సమయాన్ని గుర్తించడానికి డేటా సహకరిస్తుంది.

ఎడిఎక్స్ కొత్త వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులకు కూడా సహాయం చేస్తుంది. ఉదాహరణకు, తెగుళ్లు మరియు వ్యాధులకు పంట నిరోధకతకు కారణమైన జన్యువులను గుర్తించడానికి పరిశోధకులు డేటాను ఉపయోగించవచ్చు.

అలానే అగ్రి అప్లికేషన్ డెవలపర్‌లు మరియు ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రైవేట్ కంపెనీలు, ఎన్జీవోలు మరియు విశ్వవిద్యాలయాల వంటి వ్యవసాయ డేటా ప్రొవైడర్‌ల మధ్య సురక్షితమైన, ప్రమాణాల ఆధారిత డేటా మార్పిడిని ఇది సులభతరం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ, ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్నారు. తదుపరి ఫలితాల ఆధారంగా రాష్ట్రం మొత్తానికి విస్తరించబడుతుంది.

కచ్‌లోని గాంధీధామ్‌లో ఇఫ్కో నానో యూరియా ప్లాంట్‌కు శంకుస్థాపన

కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా ఈరోజు కచ్‌లోని గాంధీధామ్‌లో ఇఫ్కో నానో యూరియా ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్ల వ్యయంతో రూపొందుతున్నాయి ప్లాంట్, సంవత్సరానికి 100,000 మెట్రిక్ టన్నుల నానో యూరియాను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటుకానుంది. ఈ ప్లాంట్ 2024 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది

ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది నానో టెక్నాలజీని ఉపయోగించి యూరియాను ఉత్పత్తి చేస్తుంది. ఐఎఫ్‌సీఓ నానో టెక్నాలజీ యూరియా పదార్థాలను నాణ్యమైన నీటితో కలిపి చిన్న చిన్న నానో గుళికలను ఉత్పత్తి చేస్తుంది. ఈ నానో కణాలు మొక్కలు సులభంగా గ్రహించేందుకు మరియు మొక్కల పెరుగుదలకు సహకరిస్తాయి.

ఢాకాలో గ్లోరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్"పై ఎగ్జిబిషన్

బంగ్లాదేశ్‌లోని హైకమిషన్ ఆఫ్ ఇండియా "గ్లోరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్"పై ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను బంగ్లాదేశ్ నేషనల్ మ్యూజియం సహకారంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” యొక్క ముఖ్యమైన సందర్భాన్ని స్మరించుకోవడానికి నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య శాశ్వతమైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ ప్రదర్శనలో బంగ్లాదేశ్‌లోని ప్రసిద్ధ కళాకారులచే 75 కళాకృతులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను బంగ్లాదేశ్‌లోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ "భారతదేశం మరియు బంగ్లాదేశ్ యొక్క గొప్ప మరియు విభిన్న సాంస్కృతిక వారసత్వం యొక్క వేడుక" అని ఆయన అన్నారు. ఈ ఎగ్జిబిషన్ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని కూడా ఆయన అన్నారు.

చిన్న నేరాలకు శిక్షగా సమాజ సేవ ప్రతిపాదన

భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కొత్త చట్టంలో చిన్న నేరాలకు శిక్షల్లో ఒకటిగా సమాజ సేవను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే లోక్‌సభలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) బిల్లు 2023 యందు ఈ ప్రతిపాదన పొందుపర్చబడింది.

పరువు నష్టం, ప్రభుత్వ ఉద్యోగులు చట్టవిరుద్ధ ప్రవర్తన వంటి చిన్న నేరాలకు దీనిని వర్తింపజేసే ఆలోచన చేస్తుంది. ఇది నేరస్థుడిని శిక్షించడం కంటే నేరం వల్ల కలిగే నష్టాన్ని సరిదిద్దడంపై దృష్టి పెడుతుంది. చిన్న నేరాలకు పాల్పడిన నేరస్థులు నిర్దిష్ట సంఖ్యలో సామాజిక సేవ చేయవలసి ఉంటుంది. ఇందులో బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, ట్రాఫిక్ నిర్వహణ, స్థానిక స్వచ్ఛంద సంస్థలో స్వచ్ఛందంగా పనిచేయడం వంటివి ఉంటాయి.

జరిమానాలు లేదా జైలు శిక్ష వంటి సాంప్రదాయిక శిక్షల కంటే నేరస్తులను శిక్షించడానికి మరియు తిరిగి నేరం చేయకుండా వారిని నిరోధించడానికి సమాజ సేవ మరింత ప్రభావవంతమైన మార్గం అని ప్రభుత్వం విశ్వసిస్తుంది. నేరాల వల్ల కలిగే హానిని సరిచేయడానికి మరియు బలమైన సంఘాలను నిర్మించడానికి సమాజ సేవ సహాయపడుతుందని కూడా ఇది నమ్ముతుంది.

రైల్వే స్టేషన్లలో జన్ ఔషధి కేంద్రాలు ఎర్పాటుకు ప్రణాళిక

రైల్వే మంత్రిత్వ శాఖ భారతదేశం అంతటా రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఎంపిక చేసిన 50 రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు మరియు సందర్శకులు జనౌషధి ఉత్పత్తులను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందచడంతో పాటుగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

జనౌషధి కేంద్రాలు, జనరిక్ ఔషధాలను మార్కెట్ ధరలో 80% గరిష్ట రిటైల్ ధరకు విక్రయిస్తాయి. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిఎ)తో కలిసి రైల్వేలు ఈ కేంద్రాలను నిర్వహిస్తాయి. ఔషధాలను సోర్సింగ్ చేయడానికి మరియు అవి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఎన్‌పిఎ బాధ్యత వహిస్తుంది.

ఒడిశా గ్రామ పంచాయతీలలో సీఎస్‌పి ప్లస్ బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లు

ఒడిశా ప్రభుత్వం గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందించడానికి 4373 అన్‌బ్యాంక్ గ్రామ పంచాయతీలలో కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్లస్ (సిఎస్‌పి ప్లస్) బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ పథకాన్ని ఆగస్టు 11, 2023న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాబోయే మూడేళ్లలో దశలవారీగా ఇది అమలు చేయబడుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమన్వయంతో ఈ సిఎస్‌పి ప్లస్ బ్యాంకింగ్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తారు. ఈ అవుట్‌లెట్‌ల కోసం ప్రభుత్వం ఐదేళ్లపాటు అద్దె రహిత బ్యాంకింగ్ స్థలాన్ని అందిస్తుంది.

సిఎస్‌పి ప్లస్ బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లు నగదు డిపాజిట్ మరియు ఉపసంహరణ, డబ్బు బదిలీ, బిల్లు చెల్లింపులు మరియు బీమా ఉత్పత్తులతో సహా అనేక రకాల బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. ఈ సిబ్బంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మరియు గర్భిణీ స్త్రీలకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. బ్యాంకులు లేని గ్రామ పంచాయితీలలో సిఎస్‌పి ప్లస్ బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లను తెరవడం ఒడిశాలో ఆర్థిక చేరికకు ఒక ప్రధాన అడుగు. ఈ ప్రాంతాల్లోని ప్రజల ఇంటింటికీ బ్యాంకింగ్ సేవలను తీసుకురావడానికి మరియు ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలకు వారి ప్రాప్యతను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది.

భారత్, అంగోలా ద్వైపాక్షిక అంశాలపై విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు

భారతదేశం మరియు అంగోలా ఆగస్టు 11, 2023న అంగోలాలోని లువాండాలో తమ ప్రారంభ విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సంప్రదింపులలో భారత ప్రతినిధి బృందానికి అదనపు కార్యదర్శి సేవాలా నాయక్ ముడే నాయకత్వం వహించగా అంగోలాన్ ప్రతినిధి బృందానికి అంబాసిడర్ ఎస్మెరాల్డా బ్రావో కొండే డా సిల్వా మెండోంకా నాయకత్వం వహించారు.

ఐక్యరాజ్యసమితి మరియు ఇతర బహుపాక్షిక ఫోరమ్‌లలో సహకారం, వాతావరణ మార్పు, అంతర్జాతీయ సౌర కూటమి మరియు స్థిరమైన అభివృద్ధితో సహా పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు.

భారతదేశం మరియు అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఈ సమావేశం ఒక ముఖ్యమైన అడుగు. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాల యొక్క పూర్తి స్థాయిని సమీక్షించాయి. వాణిజ్యం, రక్షణ, శక్తి, వ్యవసాయం, ఆరోగ్యం మరియు ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అంగీకరించాయి.

అంగోలా ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీసు వారి వలస దేశము. దీనికి ఉత్తరమున బెల్జియం, కాంగో, తూర్పున ఉత్తర రొడీషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాలు హద్దులుగా ఉన్నాయి. దీని రాజధాని నగరం లువాండా, అధికారిక భాష పోర్చుగీస్, అధికారిక కరెన్సీ అంగోలాన్ క్వాంజా.

Post Comment