Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 27 ఆగష్టు 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 27 ఆగష్టు 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 27 ఆగష్టు 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. ఇవి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

గాంధీనగర్‌లో 2వ G20-చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ సమావేశం

భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో భాగంగా, రెండవ G20-చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ సమావేశం ఆగష్టు 28న గాంధీనగర్‌లో జరిగింది. సైన్స్ సలహాదారులు, శాస్త్రవేత్తలు, G 20 దేశాలు మరియు ఆహ్వానించబడిన దేశాల పరిశోధకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం శాస్త్ర పరిశోధనలు మరియు సాంకేతికత అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించింది.

ఈ సమావేశంలో మానవ ఆరోగ్యం మరియు పర్యావరణంపై వాతావరణ మార్పు ప్రభావం, పేదరికం, ఆకలి మరియు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి కొత్త సాంకేతికతల అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వైవిధ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొ. అజయ్ కుమార్ సూద్ మరియు ఇటలీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్. మౌరో ఫెరారీ సహ అధ్యక్షత వహించారు.

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమర్సన్ మ్నాంగాగ్వా రెండోసారి ఎన్నిక

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మెర్సన్ మ్నంగాగ్వా ఆగస్టు 26, 2023న తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికలలో అతను 52.6% ఓట్లను దక్కించుకున్నారు. అతని ప్రధాన ప్రత్యర్థి సిటిజన్స్ కోయలిషన్ ఫర్ చేంజ్ పార్టీకి చెందిన నెల్సన్ చమీసా 44% ఓట్లు దక్కించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ప్రత్యర్థి సీసీసీ ఫలితాలను తిరస్కరించింది.

తిరుగుబాటులో రాబర్ట్ ముగాబేను అధికారం నుండి తొలగించిన తర్వాత 2018లో మ్నంగాగ్వా మొదటిసారి జింబాబ్వే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తానని, ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకువస్తానని వాగ్దానం చేసిన ఆయన, నిరంకుశ ధోరణితో వాటిని సాధించడంలో విఫలమయ్యారు. జింబాబ్వేలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.

ఈ దేశం ప్రస్తుతం అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు పేదరికాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను పరిష్కరించడంలో మ్నంగాగ్వా విఫలమయ్యారు. అయితే తాజా ఎన్నికల ఫలితాలు జింబాబ్వే భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్నంగాగ్వా తిరిగి ఎన్నిక కావడం వలన అతని విధానాలను కొనసాగించడానికి ప్రజల నుండి మద్దతు దొరికినట్లు అయ్యింది, అయితే ప్రత్యర్థులు ఫలితాలను తిరస్కరించడంతో ఆ దేశంలో రాజకీయ అస్థిరతకు దారితీయవచ్చు.

శ్రీలంకలో కాండీ ఎసలా పెరహెరా ఫెస్టివల్

శ్రీలంకలోని పురాతన సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలలో ఒకటైన కాండీ ఎసలా పెరహెరా ఫెస్టివల్ ఆగష్టు 24 నుండి సెప్టెంబర్ 1 మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక వేడుకను క్యాండీలోని శ్రీ దళాద మాలిగావాలో విశ్రాంతి తీసుకున్న బుద్ధ భగవానుడి పవిత్ర దంత అవశేషాన్ని ప్రతిష్టించడానికి ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

ఈ ఊరేగింపు, శ్రీలంక సాంప్రదాయ నృత్యకారులు, సంగీతకారులు మరియు ప్రదర్శనకారులతో సాగుతుంది. ఈ ఊరేగింపులో యొక్క ఏనుగు మరియు వాటి దంతాలను దుస్తులు మరియు నగలతో అలంకరిస్తారు. కాండీ ఎసలా పెరహెరాకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశ గుర్తింపు ఉంది. ఇది శ్రీలంక యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుగా భావిస్తారు.

శ్రీలంకలో తొలిసారి కర్ణాటక కల్చరల్ ఫెస్టివల్

శ్రీలంక తన మొట్టమొదటి కర్నాటక కల్చరల్ ఫెస్టివల్‌ను ఆగస్ట్ 25, 2023న నిర్వహించింది. ఈ ఈవెంట్‌ని ఇంటర్నేషనల్ కల్చరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వామీ వివేకానంద కల్చరల్ సెంటర్ మరియు ఎమ్ఈ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించబడింది

ఈ ఉత్సవం కొలంబోలోని బీమిచ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నృత్యాలు, జానపద పాటలు, నాటకాలు, తోలుబొమ్మల ప్రదర్శనలతో సహా కర్ణాటకకు చెందిన కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పండుగలో కర్ణాటక సంప్రదాయ వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి శ్రీలంక ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు మరియు ప్రజలతో సహా 2,000 మందికి పైగా హాజరయ్యారు. శ్రీలంక మరియు కర్ణాటకల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం సహాపడుతుంది. శ్రీలంక మరియు భారతదేశం నుండి ప్రజలు ఒకరి సంస్కృతుల గురించి మరొకరు తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది.

ఇస్కాన్ యొక్క మొదటి ఇ-లైబ్రరీ యాప్ ట్రాన్సెండ్‌ ప్రారంభం

స్కాన్, లేదా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్, ట్రాన్స్‌సెండ్ అనే ఇంటిగ్రేటెడ్ ఇ-లైబ్రరీ యాప్‌ను ఆగష్టు 28న ప్రారంభించింది. ట్రాన్స్‌సెండ్ అనేది ఆడియో మరియు ఇ-బుక్స్ రెండింటినీ ఒకే చోట అందించే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇ-లైబ్రరీ యాప్. ఈ యాప్‌లో 600 పైగా ఇ-బుక్స్ మరియు 20,000 సంస్కృత శ్లోక పారాయణాలు 11 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు కేవలం కొన్ని ట్యాప్‌లతో ఆడియో మరియు ఇ-బుక్ ఫార్మాట్‌లను యాక్సిస్ చేయవచ్చు.

ట్రాన్‌సెండ్ యాప్ కృష్ణ చైతన్యం గురించి మరింత తెలుసుకోవడానికి మరియు మీ ఆధ్యాత్మిక వైపు కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప మార్గం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క విస్తారమైన లైబ్రరీని యాక్సెస్ చేయడానికి మీకు అవకాశం కల్పిస్తుంది.

ఎలైట్ ప్రపంచ రికార్డులను సాధించిందిన తిరుపత్తూరు జిల్లా

మిళనాడులోని తిరుపత్తూరు జిల్లా కేవలం 30 రోజుల్లో 1,556 ఫారం పాండ్‌లను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. 2021లో 1,121 చెరువులను నిర్మించిన ఇదే రాష్ట్రానికి చెందిన తిరువణ్ణామలై జిల్లా మునుపటి రికార్డును కలిగి ఉంది. తిరుపత్తూరు జిల్లా యంత్రాంగం ఈ 1,556 చెరువులను తవ్వడానికి జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికుల సేవలను ఉపయోగించుకుంది.

ఈ జిల్లా భూగర్భ జలాలను పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంను చెప్పట్టారు. ఒక్కో చెరువులో 2 లక్షల లీటర్ల వర్షపు నీరు నిల్వ చేసే సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రపంచ రికార్డులను ధృవీకరించే యూఎస్-ఆధారిత సంస్థ ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ ఈ విజయాన్ని గుర్తించింది. ఆ సంస్థకు చెందిన బృందం తిరుపత్తూరుకు వచ్చి స్థలాన్ని పరిశీలించి అధికారికంగా ఈ రికార్డును ధృవీకరించారు.

తిరుపత్తూరు జిల్లా యంత్రాంగం రికార్డు స్థాయిలో సాధించడం వారి కృషి మరియు అంకితభావానికి నిదర్శనం. ఈ చొరవ జిల్లాలో నీటి ఎద్దడిని మెరుగుపరచడంతోపాటు స్థానిక రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. భారతదేశంలోని ఇతర జిల్లాలు కూడా తిరుపత్తూరును ఆదర్శంగా తీసుకుని తమ ప్రాంతాలలో నీటి నిల్వను మెరుగుపర్చుకోవచ్చు.

కజిరంగా నేషనల్ పార్కులో మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌

అస్సాం ప్రభుత్వం ఆగస్టు 25న ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిణి సోనాలి ఘోష్‌ను కజిరంగా నేషనల్ పార్క్ తదుపరి ఫీల్డ్ డైరెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పరిశోధన, విద్య మరియు వర్కింగ్ ప్లాన్) ఉన్న ఆమె సెప్టెంబర్ 1న ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనితో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సోనాలి ఘోష్ వచ్చే నెల నుండి కజిరంగా నేషనల్ పార్క్‌కి మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా మారనున్నారు.

కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలోని గోలాఘాట్ మరియు నాగావ్ జిల్లాల పరిధిలో ఉంది. ఇది ప్రపంచంలోని మూడింట రెండు వంతుల భారతీయ ఖడ్గమృగాలకు ఆతిధ్యం ఇస్తుంది. ఈ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కలిగిఉంది.

ఈ పార్క్ బ్రహ్మపుత్ర నది వరద మైదానాలలో 430 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం అనేక రకాల వన్యప్రాణులకు నిలయంగా ఉంది, ఇందులో ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు, అడవి దున్నలు, చిత్తడి జింకలు మరియు అనేక జాతుల పక్షులు ఉన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి. ఇది అక్టోబర్ నుండి మే వరకు సందర్శకులకు తెరిచి ఉంటుంది.

Post Comment