Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 05, 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 05, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 05, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

13 కోట్ల గ్రామీణ కనెక్షన్ల మైలురాయిని సాధించిన జల్ జీవన్ మిషన్

జల్ జీవన్ మిషన్ 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లను అందించి అరుదైన మైలురాయిని సాధించింది. 2019లో ప్రారంభించినప్పటి నుండి కేవలం నాలుగు సంవత్సరాలలో ఈ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం పథకం దేశంలో దాదాపు 60 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తుంది. 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహానికి పంపు నీటి కనెక్షన్‌లను అందించడం లక్ష్యంగా ఇది కొనసాగుతుంది.

2019 నాటికీ భారతదేశంలో కేవలం 17% గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు అందుబాటులో ఉండేవి, ప్రస్తుతం లక్షలాది గ్రామీణ భారతీయులకు త్రాగునీరు అందుబాటులోకి వచ్చింది. గోవా, తెలంగాణ, హర్యానా, పంజాబ్, గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు 100 శాతం కవరేజ్ పూర్తిచేశాయి. ఈ మహిళలు మరియు బాలికలు నీటి కోసం వెచ్చించే సమయాన్ని మరియు శ్రమను కూడా తగ్గించింది. విద్య మరియు ఉపాధి వంటి ఇతర కార్యకలాపాలను కొనసాగించడానికి వారికి స్వేచ్ఛనిచ్చింది.

అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్ ప్రారంభం

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సెప్టెంబరు 4, 2023న అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ 2017లో ప్రారంభించబడిన అసలైన అడాప్ట్ ఎ హెరిటేజ్ ప్రోగ్రామ్‌కి పునరుద్దరించిన వెర్షన్. ఈ కొత్త ప్రోగ్రామ్ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని స్వీకరించడానికి మరియు సంరక్షించడానికి కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేస్తుంది. ఈ కార్యక్రమం, న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ లోని సంవెట్ ఆడిటోరియంలో ప్రారంభించబడింది.

అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్ కింద, కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు వెబ్ పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా వీరు స్మారక చిహ్నలను దత్తత తీసుకునేందుకు, మౌలికసదుపాయాలు అభివృద్ధి పర్చేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మరియు విదేశీ కంపెనీలతో సహా అన్ని కార్పొరేట్ సంస్థలు పాల్గొనవచ్చు. సామాజిక బాధ్యత పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించేందుకు మరియు దేశ స్థిరమైన అభివృద్ధికి తోడ్పడేందుకు కార్పొరేట్ సంస్థలకు ఇది ఒక మంచి అవకాశం.

అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0 కార్యక్రమం స్వాగతించదగిన కార్యక్రమం, ఇది ప్రభుత్వ వనరులు మరియు భారతదేశ విస్తారమైన సాంస్కృతిక వారసత్వ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను ఆర్థికాభివృద్ధితో సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న 'విరాసత్ భీ, వికాస్ భీ' అనే ప్రభుత్వ దార్శనికతతో ఈ కార్యక్రమం కూడా జత చేయబడింది.

గయానా తదుపరి భారతహైకమిషనర్‌గా అమిత్ ఎస్ తెలాంగ్

భారత దౌత్యవేత్త అమిత్ ఎస్ తెలాంగ్, కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానాకు భారతదేశ తదుపరి హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం ఫ్రాంక్‌ఫర్ట్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో కాన్సుల్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2005 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి.

గయానా, అధికారికనామం కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా. ఇది దక్షిణ అమెరికా లోని ఉత్తర తీరంలో గల చిన్న దేశం.కరీబియ దేశాలు, కరీబియన్ సంఘంతో ఉన్న బలమైన రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక సంబంధాల కారణంగా గయానాను కరీబియన్ దేశాలతో జత చేసారు. దేశ సరిహద్దులలో తూర్పున సురినామ్, దక్షిణం, ఆగ్నేయాన బ్రెజిల్, పశ్చిమాన వెనుజుల, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. దీని రాజధాని నగరం జార్జిటౌన్. దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో గయానా 4వ స్థానంలో ఉంది.

మొదటి ద్వంద వినియోగ సర్టిఫైడ్ డ్రోన్‌గా మారుత్ డ్రోన్స్ AG - 365S

మారుత్ డ్రోన్స్ యొక్క ఏజీ 365S ద్వంద్వ ఉపయోగం కోసం డీజీసీఎ సర్టిఫైడ్ పొందిన డ్రోన్‌గా గుర్తింపు పొందింది. ఇది వాణిజ్య మరియు సైనిక అనువర్తనాల్లో ఉపయోగం కోసం అభివృద్ధి చేయబడింది. ఇది ఏరియల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మ్యాపింగ్, సర్వేయింగ్, పంట పర్యవేక్షణ, పిచికారగా మరియు నిత్యావసర సరుకుల డెలివరీకి కూడా ఉపయోగపడుతుంది.

హైదరాబాద్‌లో ఉన్న ఈ మారుత్ డ్రోన్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ ప్రేమ్ కుమార్ విస్లావత్ స్థాపించారు. ఈయన ఐఐటీ-గౌహతిలో ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. మారుత్ డ్రోన్స్ భారతదేశ డ్రోన్ పరిశ్రమలో డేటా అనలిటిక్స్, ఐఓటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్‌లను పరిచయం చేసిన మొదటి కంపెనీగా గుర్తింపు పొందారు.

ఇండియాను భారత్‌గా పేరు మార్చే  ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం

బీజేపీ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వం సమీప భవిష్యత్తులో దేశం యొక్క అధికారిక పేరును "ఇండియా" నుండి "భారత్"గా మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవలి నెలల్లో ప్రభుత్వం "భారత్" అనే పేరును తరచుగా ఉపయోగిస్తుండడం మరియు ఇటీవలే జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి అధికారిక ఆహ్వానంలో భారత రాష్ట్రపతిని  "భారత్ అధ్యక్షుడు" అని పేర్కొనడం ఈ ఊహను నిజం చేస్తుంది.

అయితే, ఈ పేరు మార్పు గురించి ప్రభుత్వం నుండి అధికారిక ధృవీకరణ లేదు. భారతదేశానికి మరింత హిందూ-కేంద్రీకృత గుర్తింపును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ మార్పును పరిశీలిస్తోందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మరికొందరు బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి దింపేందుకు ఇండియా పేరుతొ ఏర్పడ్డ ప్రతిపక్ష పార్టీల కూటమి కారణంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు భావిస్తున్నారు.

వాస్తవానికి భారత రాజ్యాంగంలో "భారతదేశం" మరియు ఇండియా అనే పేర్లు ఇప్పటికే పొందుపర్చబడి ఉన్నాయి. భారత ప్రభుత్వం దేశం పేరును మార్చాలని నిర్ణయించుకుంటే, అది ఒక ముఖ్యమైన చర్య అవుతుంది. భారతదేశం ఒక పెద్ద మరియు వైవిధ్యమైన దేశం. ఈ పేరు మార్పు మిశ్రమ స్పందనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతమంది మార్పును సమర్థించవచ్చు, మరికొందరు వ్యతిరేకించవచ్చు.

ఈ పేరు మార్పుకు రాజ్యాంగ సవరణ అవసరమని, దీనికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదం అవసరమని కూడా గమనించాలి. మొత్తంమీద, భారతదేశం త్వరలో "భారత్" అని పిలవబడుతుందో లేదో ఖచ్చితంగా చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు. అయితే, ప్రభుత్వం కనీసం ఈ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ మరణాల రేటు

బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ మరణాల రేటు నివేదించబడింది. ఆ దేశ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం, బంగ్లాదేశ్‌లో 2023లో 60,000 డెంగ్యూ కేసులు నమోదు కాగా 634 మందికి పైగా మరణాలు నమోదు కబడినట్లు తెలుస్తుంది. ఇది 2022లో నమోదైన కేసులు మరియు మరణాల సంఖ్య కంటే రెండింతలు ఎక్కువగా నివేదించబడింది. అయితే ప్రపంచంలో అత్యధిక డెంగ్యూ కేసులు బ్రెజిల్ యందు నమోదు అవుతున్నాయి.

బంగ్లాదేశ్‌లో డెంగ్యూ మరణాల రేటు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక అంశం దేశంలోని వాతావరణం. బంగ్లాదేశ్ ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది, ఇది డెంగ్యూ వైరస్‌ను మోసే దోమల పెంపకానికి అనువైనది. ఈ దేశం యొక్క అధిక జనసాంద్రత మరొక అంశం. దీనివల్ల డెంగ్యూ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది.

డెంగ్యూ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది దోమల నుండి ప్రజలకు వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల వాతావరణంలో ఇది సర్వసాధారణం. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. జ్వరం, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, దద్దుర్లు మరియు రక్తస్రావం వంటివి డెంగ్యూ యొక్క లక్షణాలు.

దివ్యాంగ పిల్లల కోసం సంబల్ యోజన పథకం

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు రాష్ట్రంలోని దివ్యాంగు పిల్లలకు సాధికారత కల్పించేందుకు సంబల్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగు పిల్లలకు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో వారికి అవసరమైన సౌకర్యాలు మరియు అవకాశాలను ఈ పథకం అందిస్తుంది. ఇందులో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఉచిత విద్య, ఉచిత రవాణా, ఉచిత వైద్య చికిత్స, వృత్తి శిక్షణ మరియు ఉపాధి కల్పన వంటి అవకాశాలను కల్పిస్తుంది.

సంబల్ యోజన అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని దివ్యాంగుల పిల్లల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడే ఒక ముఖ్యమైన కార్యక్రమం. సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరికీ పూర్తి స్థాయిలో అవకాశం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఈ పథకం దివ్యాంగ్ పిల్లల కుటుంబాలకు వారి పిల్లల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.

100 వికెట్లు తీసిన తొలి అసోసియేట్ క్రికెట్ ప్లేయర్‌గా పట్టాయా

మలేషియాలోని బంగిలో కువైట్‌తో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆసియా రీజియన్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన నట్టయ బూచతం మహిళల టీ20ఐలలో 100 వికెట్లు తీసిన మొదటి అసోసియేట్ ప్లేయర్‌గా నిలిచింది. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయినా ఈమె 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అప్పటి నుండి 58 మ్యాచుల్లో 19.27 సగటుతో మరియు 6.58 ఎకానమీ రేటుతో 102 వికెట్లు తీసింది.

డా. నవనీత్ అగర్వాల్‌కు నేషనల్ డయాబెటాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

బీట్‌ఓలో చీఫ్ క్లినికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ నవనీత్ అగర్వాల్‌కు 2023లో ప్రతిష్టాత్మకమైన నేషనల్ డయాబెటాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది, అతని అసాధారణమైన వైద్య సేవ మరియు మధుమేహుల జీవితాలను మెరుగుపరచడంలో చూపిన అంకితభావంకు ఈ గౌరవం లభించింది.

డాక్టర్ అగర్వాల్ 15 సంవత్సరాల అనుభవంతో అత్యంత గౌరవనీయమైన డయాబెటాలజిస్ట్‌గా గుర్తింపు పొందారు. సంక్లిష్ట మధుమేహం కేసులను నిర్వహించడంలో నైపుణ్యం మరియు తన రోగులకు వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడంలో నిబద్ధతకు ప్రసిద్ధి చెందాడు. దేశ వ్యాప్తంగా లక్షల మంది యోగులకు మధుమేహ చికిత్స అందించారు.

గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం ఐఎస్ఓ 10002:2018 సర్టిఫికేషన్

గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం విమానాశ్రయ కార్యకలాపాలు, నిర్వహణ మరియు అభివృద్ధిలో నాణ్యత నిర్వహణ వ్యవస్థ కోసం ISO 10002:2018 ధృవీకరణను పొందింది. విమానాశ్రయం యొక్క నాణ్యత నిర్వహణ వ్యవస్థ యొక్క సమగ్ర మూల్యాంకనం తర్వాత బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ (బీఎస్ఐ) ద్వారా ఈ సర్టిఫికేషన్ లభించింది.

ఐఎస్ఓ 10002:2018 అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పారిశ్రామిక నాణ్యత ప్రమాణం, ఇది సంస్థలకు వారి నాణ్యత నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఈ సర్టిఫికేషన్ సంస్థల వినియోగదారులు మరియు వాటాదారులకు అధిక-నాణ్యత సేవలను అందించడానికి అవకాశం కల్పిస్తుంది.

Post Comment