Advertisement
టీఎస్‌పీఎస్సీ గ్రూపు-4 ఎగ్జామ్ | సిలబస్ & కటాఫ్ మార్కులు
Telangana

టీఎస్‌పీఎస్సీ గ్రూపు-4 ఎగ్జామ్ | సిలబస్ & కటాఫ్ మార్కులు

టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూపు IV పోస్టుల నియామక ప్రక్రియ రాతపరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా నిర్వహిస్తారు. రాతపరీక్ష రెండు పాపేర్లుగా 300 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హుత పొందివారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి వివిధ రిజర్వేషన్ల వారీగా తుది నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. దరఖాస్తు  ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు అయితే రాతపరీక్షకు ముందు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూపు 4 ద్వారా భర్తీ చేసే పోస్టులు

  • జూనియర్ అసిస్టెంట్
  •  స్టెనోగ్రాఫర్
  • జూనియర్ టైపిస్ట్-కమ్-అసిస్టెంట్
  • సీనియర్ అసిస్టెంట్

టీఎస్‌పీఎస్సీ గ్రూపు IV రాతపరీక్ష విధానం

టీఎస్‌పీఎస్సీ గ్రూపు IV పోస్టుల నియామక ప్రక్రియ రాతపరీక్ష మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా నిర్వహిస్తారు. రాతపరీక్ష 300 మార్కులకు 2 పేపర్లుగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు జరుగుతుంది.  ప్రతి పేపర్ 150 ప్రశ్నలతో, 2.30 గంటల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఒక్కో పేపర్ కోసం వివరంగా తెలుసుకుందాం.

జనరల్ నాలెడ్జ్ ( పేపర్ పేపర్ I )

పేపర్ I లో భాగంగా 150 మార్కులకు జనరల్ నాలెడ్జ్  సంబందించిన అంశాలతో ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహస్తారు. ప్రశ్న పత్రం మూడు సెక్షన్లుగా, ఒక్కో సెక్షన్ యందు 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి వర్తమాన వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలు, నిత్యజీవితంలో సైన్స్, పర్యావరణ అంశాలు-విపత్తు నిర్వహణ, భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతీ, బాష, కళలు, సాహిత్యం, మరియు తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఇవ్వబడతాయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
జనరల్ నాలెడ్జ్ & జనరల్ స్టడీస్ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

సెక్రటేరియల్ ఎబిలిటీ  ( పేపర్ II )

పేపర్ II సెక్రటేరియల్ ఎబిలిటీ అంశాలతో కూడిన ఆబ్జెక్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 2.30 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్స్, కంప్రహెన్షన్ వంటి వివిధ అంశాల నుండి ఇవ్వబడతయి.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
సెక్రటేరియల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 మార్కులు 2.30 గంటలు

సర్టిఫికెట్ వెరిఫికేషన్

రాతపరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగా, వివిధ సమీకరణలు పరిగణలోకి తీసుకుని తుది ఎంపికను పూర్తిచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేట్ పూర్తిచేసి నియామక పత్రాలు జారీ చేస్తారు.

కేటగిరి & రిజర్వేషన్ కేటగిరి & రిజర్వేషన్ 
బీసీ - 29%
ఎస్సీ - 15%
ఎస్టీ - 7%
EWS - 10%
Sports - 2%
PH - 4%.

క్వాలిఫైయింగ్ మార్కులు

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, మాజీ సైనికులు - 40% మార్కులు తప్పనిసరి.
  • బీసీ అభ్యర్థులు లకు 35 శాతం మార్కులు తప్పనిసరి.
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం

Post Comment