జేఎన్‌యూఈఈ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions MBA Entrance Exams NTA Exams University Entrance Exams

జేఎన్‌యూఈఈ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

జేఎన్‌యూఈఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు రీసెర్చ్ ప్రోగ్రాంలలో అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఉన్నత విద్య అందిస్తున్న ఇండియన్ యూనివర్సిటీలలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ టాప్ 2లో ఉంటుంది.

Advertisement

పీజీ కోర్సులకు, పరిశోధనాత్మక కోర్సులకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కంచుకోట. యూనివర్సిటీ అనుబంధంగా 12 రీసెర్చ్ & డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లు, 6 డిఫెన్స్ ఇనిస్టిట్యూట్లు దేశంలో విద్యా సేవలు అందిస్తున్నాయి.

జేఎన్‌యూఈఈ 2023

Exam Name JNUEE 2023
Exam Type Admission
Admission For UG, PG & RP
Exam Date -
Exam Duration 180 Minutes
Exam Level National Level

జేఎన్‌యూఈఈ సమాచారం

జెఎన్‌యూఈఈ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి
  • యూజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్/10+2 పూర్తిచేసి ఉండాలి
  • పీజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి పూర్తిచేసి ఉండాలి
  • పీహెచ్డీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో సంబంధిత పీజీ కోర్సులు పూర్తిచేసి ఉండాలి

జేఎన్‌యూఈఈ 2023 షెడ్యూల్

 దరఖాస్తు తేదీ -
అడ్మిట్ కార్డు -
ఎగ్జామ్ -
రిజల్ట్స్ -

జేఎన్‌యూఈఈ దరఖాస్తు ఫీజు

రిజర్వేషన్ కేటగిరి యూజీ  కోర్సులు పీజీ కోర్సులు పీహెచ్డీ /ఎంఫిల్
జనరల్ కేటగిరి 400/- 400/- 530/-
ఎస్సీ, ఎస్టీ, ఓబీసి 265/- 265/- 310/-

జేఎన్‌యూఈఈ పరీక్ష కేంద్రాలు

ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ
చిత్తూరు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం హైదరాబాద్, సికంద్రాబాద్, రంగారెడ్డి, వరంగల్

జేఎన్‌యూఈఈ దరఖాస్తు ప్రక్రియ

జేఎన్‌యూఈఈ దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పోర్టల్ (www.jnu.ac.in) నుండి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి పోర్టల్ని సందర్శించిన వారు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ వివరాలతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా అకాడమిక్ మెరిట్ ఆధారంగా యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆ సంబంధిత దరఖాస్తూ ఫీజు చెల్లించి మెరిట్ ఆధారిత అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది.

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరిన విద్య, వ్యక్తిగత సమాచారం తప్పులు దొర్లకుండా దరఖాస్తులో పొందుపర్చాలి. రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, పరీక్షా కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు పొందుపర్చినప్పుడు మరోమారు సరిచూసుకోండి. ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు.

అందువలన అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి.

జేఎన్‌యూఈఈ ఎగ్జామ్ నమూనా

జేఎన్‌యూఈఈ యూజీ మరియు పీజీ, పీహెచ్డీ కోర్సులకు సంబంధించి పరీక్షా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహించబడుతుంది. క్వశ్చన్ పేపర్లో 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు అభ్యర్థి ఎంపిక చేసుకున్న కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల నుండి ఇవ్వబడతాయి.

జేఎన్‌యూఈఈ యూజీ & పీజీ  ప్రవేశ పరీక్ష నమూనా

సబ్జెక్టు ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
యూజీ పేపర్ 100 100 120 నిముషాలు

జేఎన్‌యూఈఈ పీహెచ్డీ, ఎంఫిల్  ప్రవేశ పరీక్ష నమూనా

సబ్జెక్టు ప్రశ్నల సంఖ్య మార్కులు సమయం
సీబీటీ (70% వెయిటేజీ) 100 100 120 నిముషాలు
వైవ వాయిస్ (30% వెయిటేజీ) - - -

జేఎన్‌యూఈఈ అడ్మిషన్ ప్రక్రియ

జేఎన్‌యూఈఈ అడ్మిషన్ ప్రక్రియ యూజీసీ నియమాలకు లోబడి జరుగుతుంది. అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశ పరీక్షా మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. 50 శాతం కనీస అర్హుత మార్కులు సాధించిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి కోర్సులో అందుబాటులో ఉండే సీట్లలో రిజర్వేషన్ కోటాల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.

పరిశోధన కోర్సులకు (పీహెచ్డీ/ఎంఫిల్) సంబంధించి అడ్మిషన్లు ప్రవేశ పరీక్షా మరియు వైవా వాయిస్ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండింటిలో కనీసం 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. తుది ఎంపిక సీబీటీ మరియు వైవా వాయిస్ లో చూపిన ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. సీబీటీ లో సాధించిన మార్కులకు 70 వెయిటేజీ, వైవా వాయిస్ స్కోరుకు 30% వెయిటేజీ లెక్కిస్తారు.

ప్రవేశ పరీక్షా ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. నెట్, గేట్ మరియు ఇతర ఫెలోషిప్స్ ఎంపికైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పరిశోధ ప్రోగ్రామ్స్ నిడివి 1 నుండి రెండేళ్లు ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అడ్మిషన్  బ్రోచుర్ తిలకించండి.

Advertisement

Post Comment