Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 07, 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 07, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 07, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

ఆసియా టీటీసీలో భారత పురుషుల జట్టుకు కాంస్యం

ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ 2023 లో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని ప్యోంగ్‌చాంగ్‌లో చైనీస్ తైపీతో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి తర్వాత కాంస్య పతకాన్ని సాధించింది.

శరత్ కమల్, హర్మీత్ దేశాయ్ మరియు సత్యన్ జ్ఞానశేఖరన్‌లతో కూడిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు తమ చివరి నాలుగు మ్యాచ్‌లలో 0-3 తేడాతో ఓడిపోయింది. ఈ పోటీలో ఓడిన ఇద్దరు సెమీ-ఫైనలిస్టులకు కాంస్య పతకాలను అందజేచారు. ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ 2023 కూడా పారిస్ 2024 ఒలింపిక్స్‌కు క్వాలిఫైయర్ టోర్నమెంటుగా పరిగణించబడుతుంది.

ఈజిప్ట్‌ బ్రైట్ స్టార్ 23 వ్యాయామంలో పాల్గొన్న ఐఎన్ఎస్ సుమేధ

భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ సెప్టెంబర్ 6-15, 2023 వరకు ఈజిప్టులో జరిగిన ఎక్సర్‌సైజ్ బ్రైట్ స్టార్ 23లో పాల్గొంది. ఈ వ్యాయామం 34 దేశాలు పాల్గొన్న మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఉమ్మడి సైనిక వ్యాయామం. ఐఎన్ఎస్ సుమేధ ఈజిప్ట్ , ఇటలీ, ఖతార్, సైప్రస్ మరియు గ్రీస్ నౌకాదళాలతో పాటుగా బ్రైట్ స్టార్ వ్యాయామంలో పాల్గొంది.

బ్రైట్ స్టార్ 23 వ్యాయామం రెండు దశల్లో నిర్వహించబడుతోంది. మొదటి హార్బర్ ఫేజ్‌లో క్రాస్-డెక్ విజిట్‌లు, ప్రొఫెషనల్ ఎక్స్ఛేంజ్‌లు, స్పోర్ట్స్ ఫిక్చర్‌లు మరియు సీ ఫేజ్ యొక్క ముందుగత ప్రణాళిక కార్యకలాపాలు ఉంటాయి. రెండవ సీ ఫేజ్‌లో లైవ్ వెపన్ ఫైరింగ్ డ్రిల్‌లతో సహా క్రాస్ డెక్ ఫ్లయింగ్, యాంటీ సర్ఫేస్ మరియు యాంటీ-ఎయిర్ ఎక్సర్‌సైజ్‌లతో కూడిన కాంప్లెక్స్ మరియు హై ఇంటెన్సిటీ వ్యాయామాలు ఉంటాయి.

ఈ వ్యాయామంలో భారత నావికాదళం పాల్గొనడం ఇదే తొలిసారి, ఇందులో ఇతర స్నేహపూర్వక విదేశీ నౌకాదళాలకు చెందిన నౌకాదళ నౌకలు కూడా పాలొన్నాయి. ఈ వ్యాయామాలు రెండు వారాల పాటు తీవ్రమైన కార్యకలాపాలు మరియు శిక్షణతో సాగాయి. ఇందులో పాల్గొనే నావికాదళాలు ఉమ్మడి శిక్షణ మరియు పరస్పర అవగాహన ద్వారా సముద్ర భద్రత మరియు ప్రపంచ స్థిరత్వంపై వారి భాగస్వామ్య నిబద్ధతను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

కమాండర్ ఎంసీ చందీప్ నేతృత్వంలోని ఐఎన్ఎస్ సుమేధ, స్వదేశీంగా నిర్మించిన సరయూ క్లాస్ నేవల్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెస్సెల్స్ యొక్క మూడవ నౌక. ఇవి ఆయుధాలు, సెన్సార్‌లు మరియు సమగ్ర హెలికాప్టర్‌ను ఎక్కే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి విభిన్న దీర్ఘకాల కార్యాచరణ మిషన్ల రూపొందించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలు. ఐఎన్ఎస్ సుమేధ 'ఆత్మనిర్భర్ భారత్' యొక్క విజన్‌ను నొక్కిచెప్పే భారతీయ నౌకానిర్మాణ పరిశ్రమ యొక్క సామర్థ్యాలకు సాక్ష్యంగా నిలుస్తుంది.

న్యూ ఢిల్లీలో వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ కాన్ఫరెన్స్

"ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒక గ్రిడ్ కోసం ట్రాన్స్‌నేషనల్ గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్స్" అనే ఒక-రోజు కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 6, 2023న భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశాన్ని భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'మహారత్న' కంపెనీ అయినా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహించింది.

ఇంధన భద్రత మరియు స్థిరమైన భవిష్యత్తును సాధించడానికి సరిహద్దు శక్తి కనెక్టివిటీ, సహకారం యొక్క సంభావ్యత కోసం ఈ సమావేశం అన్వేషించింది. ఇది ట్రాన్స్‌నేషనల్ గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్‌ల యొక్క సవాళ్లు మరియు అవకాశాల గురించి మరియు "ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒక గ్రిడ్" యొక్క దృష్టిని ప్రారంభించడంలో సాంకేతికత ఆవిష్కరణల పాత్ర గురించి కూడా చర్చించింది.

ఈ సదస్సుకు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రముఖులు మరియు నిపుణులు హాజరయ్యారు. కాన్ఫరెన్స్‌లో వర్చువల్ ప్రసంగంలో, కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి, ఆర్‌కె సింగ్ మాట్లాడుతూ, భారతదేశం ఇప్పటికే తన పొరుగు దేశాలతో సరిహద్దు ఇంటర్‌కనెక్షన్‌లను ఏర్పాటు చేసిందని, వివిధ క్రాస్ బోర్డర్ లింక్‌లను బలోపేతం చేసే ప్రక్రియలో ఉందని అన్నారు.

ఈ సమావేశంలో "ప్రాంతీయ గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్‌ల కోసం రెగ్యులేటరీ మరియు చట్టపరమైన పరిగణనలు" అనే అంశంపై కూడా ప్యానెల్ చర్చ జరిగింది. ప్యానెలిస్ట్‌లు అంతర్జాతీయ గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్‌లను సులభతరం చేయడానికి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లను సమన్వయం చేయడం మరియు చట్టపరమైన సవాళ్లను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను ఇందులో చర్చించారు.

అదీబ్ అహమ్మద్‌కు ఫిన్‌టెక్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు

సెప్టెంబర్ 7, 2023న భారతదేశంలోని ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ అవార్డ్స్ 2023లో లులు ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అదీబ్ అహమ్మద్ లీడింగ్ ఫిన్‌టెక్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అహ్మద్, గల్ఫ్ సహకార దేశాలు (జీసీసీ) మరియు భారతదేశం మధ్య సరిహద్దు చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చిన దూరదృష్టి గల వ్యవస్థాపకుడు. లులు ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ మరియు జీసీసీ ప్రాంతాలలో 10 దేశాలలో 300కి పైగా కస్టమర్ ఎంగేజ్‌మెంట్ సెంటర్‌లు మరియు డిజిటల్ చెల్లింపు పరిష్కారాల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.

లులూ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌ను ప్రపంచంలోని ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా చేయడంలో అహ్మద్ నాయకత్వం కీలకపాత్ర పోషించింది. అతను ఆర్థిక సేవలను వెనుకబడిన కమ్యూనిటీలలోని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి పనిచేశాడు. లీడింగ్ ఫిన్‌టెక్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఫిన్‌టెక్ పరిశ్రమకు అహమ్మద్ చేసిన సేవలకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఫిన్‌టెక్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతకు ఇది నిదర్శనం.

డబ్ల్యు బ్రాండ్ ఎండార్సర్‌గా అనుష్క శర్మ

ప్రముఖ భారతీయ నటి అనుష్క శర్మ మహిళల ఫ్యాషన్ బ్రాండ్ డబ్ల్యూకి బ్రాండ్ ఎండార్సర్‌గా నియమితులయ్యారు. ఈ భాగస్వామ్యాన్ని సెప్టెంబర్ 9, 2023న ఆ సంస్థ ప్రకటించింది. ఈ బ్రాండ్ యొక్క రాబోయే పండుగల ప్రచారంలో శర్మ కనిపించనున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ, విజయవంతమైన నటీమణులలో శర్మ ఒకరు. 2013లో తన స్వంత నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్‌ని ప్రారంభించిన ఆమె విజయవంతమైన వ్యవస్థాపకురాలుగా గుర్తింపు పొందారు.

అనుష్క శర్మ, సామాజిక అంశాల పట్ల ఆమె నిబద్ధత మరియు ఆమె స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందారు. డబ్ల్యూ అనేది భారతదేశంలోని ప్రముఖ మహిళల ఫ్యాషన్ బ్రాండ్. ఇది స్టైలిష్ దుస్తులకు ప్రసిద్ధి చెందింది. అనుష్క శర్మతో ఈ బ్రాండ్ అనుబంధం భారతీయ వినియోగదారులలో దాని ప్రజాదరణను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

స్టెమ్ సెల్స్ నుండి సింథటిక్ పిండాలను సృష్టించిన ఇజ్రాయిల్ పరిశోధకులు

ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి సింథటిక్ పిండాన్ని సృష్టించారు. ఒక ప్రధాన వైద్య శాస్త్ర పురోగతిలో భాగంగా శాస్త్రవేత్తలు మూల కణాలను ఉపయోగించి గర్భం వెలుపల ప్రపంచంలోని మొట్టమొదటి సింథటిక్ పిండాన్ని అభివృద్ధి చేశారు.

నేచర్ జర్నల్‌లో ప్రచురించబదిన ఇజ్రాయెల్‌లోని వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు ప్రయోగ ఫలితాల ప్రకారం పిండ మూల కణాలు, ఎక్స్‌ట్రాఎంబ్రియోనిక్ మూల కణాలు మరియు ట్రోఫోబ్లాస్ట్ మూల కణాలను కలపడం ద్వారా ఈ సింథటిక్ పిండాలను సృష్టించారు. దీని కోసం ఈ మూలకణాలను ఒక ప్రత్యేక మాధ్యమంలో కల్చర్ చేశారు. ఇది పిండం లాంటి నిర్మాణంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది.

ఈ సింథటిక్ పిండాలు 10 రోజుల వరకు అభివృద్ధి చెందాయి. ఇది మానవ అభివృద్ధి యొక్క ప్రారంభ దశలకు సమానం. అయితే ఈ పిండాలకు ప్లాసెంటా లేనందున అవి తర్వాత అభివృద్ధికి చేరుకోలేకపోయాయి. ఈ పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవి విజయవంతమైతే మానవ ప్రారంభ పుట్టుక, వంద్యత్వా నివారణ సమస్యకు సమాధానం దొరుకుతుంది.

అయితే సింథటిక్ పిండాల సృష్టి అనేక నైతిక ఆందోళనలను పెంచుతుంది. డిజైనర్ శిశువులను సృష్టించడానికి లేదా మానవులను క్లోన్ చేయడానికి సాంకేతికత ఉపయోగించబడుతుందని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. మరికొందరు సాంకేతికత కొత్త జీవితాన్ని సృష్టించడానికి దారితీస్తుందని ఆందోళన చెందుతారు. ఈ పరిశోధన గణనీయమైన నైతిక వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని నమ్ముతున్నారు.

జపాన్ XRISM పరిశోధన ప్రయోగం విజయవంతం

జపాన్ యొక్క ఎక్స్-రే ఇమేజింగ్ & స్పెక్ట్రోస్కోపీ మిషన్ (XRISM), మరియు స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) రాకెట్ ప్రయోగం తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి సెప్టెంబర్ 7న విజయవంతంగా ప్రయోగించబడింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) H-IIA రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

XRISM అనేది జాక్సా, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్. ఇది గెలాక్సీల ద్వారా వీచే వేడి గ్యాస్ ప్లాస్మా గాలిని అధ్యయనం చేయడానికి ఇది రూపొందించబడింది. XRISM స్పేస్-టైమ్ యొక్క నిర్మాణం మరియు విశ్వం యొక్క పరిణామాన్ని కూడా అధ్యయనం చేస్తుంది. XRISM శక్తివంతమైన X-రే టెలిస్కోప్ మరియు స్పెక్ట్రోమీటర్‌తో అమర్చబడి ఉంది.

ఈ టెలిస్కోప్ మునుపటి ఎక్స్-రే టెలిస్కోప్ కంటే చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో సుదూర గెలాక్సీల నుండి ఎక్స్-కిరణాలను కేంద్రీకరించగలదు. ఈ స్పెక్ట్రోమీటర్ X- కిరణాల శక్తిని కొలవగలదు, ఇది ప్లాస్మా యొక్క కూర్పు మరియు ఉష్ణోగ్రత గురించి సమాచారాన్ని అందిస్తుంది.

XRISM విశ్వంపై మన అవగాహనను విప్లవాత్మకంగా మారుస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీలు ఎలా ఏర్పడతాయి మరియు అభివృద్ధి చెందుతాయి మరియు బ్లాక్ హోల్స్ మరియు న్యూట్రాన్ నక్షత్రాలు వాటి పరిసరాలతో ఎలా సంకర్షణ చెందుతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ స్వభావం గురించి మన సిద్ధాంతాలను పరీక్షించడానికి కూడా XRISM సమాచారం సహాయపడవొచ్చు.

స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) అనేది చిన్నపాటి లూనార్ ల్యాండర్. ఇది భవిష్యత్తులో చంద్రునిపై ప్రయోగాలకు అవసరమయ్యే పిన్‌పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీని పరిశోధించడానికి మరియు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ లాండింగ్ ప్రక్రియను ధృవీకరించడానికి రూపొందించిన ఒక మిషన్. ఇది పరిశోధకులు కోరుకున్న చోట ల్యాండ్ అవ్వగలిగేలా సహాపడుతుంది.

ఏప్రిల్ 15 బెంగాల్ ఫౌండేషన్ డేగా పాటించాలని బెంగాల్ అసెంబ్లీ తీర్మానం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సెప్టెంబరు 7, 2023న బెంగాలీ నూతన సంవత్సర దినమైన (పొయిలా బైసాఖ్) ఏప్రిల్ 15ని బెంగాల్ డేగా పాటించాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 167 మంది టీఎంసీ సభ్యులు ఓటు వేయగా, బీజేపీకి చెందిన 62 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. అలానే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'బంగ్లార్ మాట్, బంగ్లా జోల్' (బెంగాల్ నేల, బెంగాల్ నీరు)ను రాష్ట్ర గీతంగా చేయాలని కూడా తీర్మానం ప్రతిపాదించింది.

అయితే 1947లో బెంగాల్ విభజన జరిగి రాష్ట్రం ఏర్పడ్డ జూన్ 20న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని వాదిస్తూ బీజేపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఇకపోతే ఏప్రిల్ 15వ తేదీని బెంగాల్ దినోత్సవంగా పాటించాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమర్థించారు, ఇది బెంగాలీలందరూ తమ మత, రాజకీయ విశ్వాసాలకు అతీతంగా జరుపుకునే రోజు అని అన్నారు. ఇది బెంగాల్ యొక్క గొప్ప సంస్కృతి మరియు వారసత్వాన్ని జరుపుకునే రోజుగా పేర్కొన్నారు.

కొంకణ్‌లో మాంగో బోర్డును ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కొంకణ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున హాపస్ సాగుకు మద్దతుగా మాంగో బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది మామిడి పంట బీమా, ఉత్పత్తి పెంపుదల, తెగులు నియంత్రణ మరియు పరిశోధన వంటి రంగాలలో మద్దతును అందిస్తుంది.

మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం మామిడి పండ్ల ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి చెందింది. దాదాపు 65,000 ఎకరాలకు పైగా మామిడి సాగు ఈ ప్రాంతంలో చేయబడుతుంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన మరియు అత్యుత్తమ మామిడి రకాల్లో ఒకటైనా ఆల్ఫోన్సో మామిడి పండ్ల యొక్క అత్యధిక ఉత్పత్తి ఈ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో జరుగుతుంది. మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లో అల్ఫోన్సోలను తరచుగా 'హపస్' అని పిలుస్తారు.

తైమూర్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు

తైమూర్-లెస్తేలో భారతదేశం తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబరు 7, 2023న జకార్తాలో జరిగే ఆసియాన్-భారత సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తైమూర్ రాజధాని నగరం దిలీలో ఈ రాయబార కార్యాలయం ఏర్పాటు కానుంది.

తైమూర్-లెస్టేలో రాయబార కార్యాలయాన్ని ప్రారంభించాలనే నిర్ణయం భారతదేశం తన యాక్ట్ ఈస్ట్ పాలసీకి మరియు ఆసియాన్ ప్రాంతంతో దాని సంబంధాలకు ప్రతిబింబం. తైమూర్-లెస్టే 2022లో ఆసియాన్లో  పరిశీలక దేశంగా చేరింది. ఇది 2025 నాటికీ పూర్తి సభ్యునిగా అవుతుందని భావిస్తున్నారు.

ఈ దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించడం వలన ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరియు అభివృద్ధి సహకారంతో సహా అనేక రంగాలలో సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు విద్యా మార్పిడిని ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతుంది.

హైదరాబాద్‌లో 3 రోజుల క్లైమేట్ రెసిస్టెంట్ అగ్రికల్చర్‌ వర్క్‌షాప్

హైదరాబాద్‌లో వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయంపై మూడు రోజుల G20 సాంకేతిక వర్క్‌షాప్ నిర్వహించబడింది. ఈ వర్క్‌షాప్‌ను వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ & వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ సమావేశంలో G20 సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నిపుణులు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం యొక్క సవాళ్లు మరియు అవకాశాల గురించి చర్చించారు.

వర్క్‌షాప్ సందర్భంగా వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం కోసం సాంకేతికతలు మరియు పద్ధతులు, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయానికి మద్దతు ఇచ్చే విధానాలు, మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం కోసం ఫైనాన్సింగ్ వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంపై G20 సాంకేతిక వర్క్‌షాప్ వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులకు వారి జ్ఞానం మరియు అనుభవాలను పంచుకోవడానికి మరియు చర్య కోసం సిఫార్సులను అభివృద్ధి చేయడానికి ఒక వేదికను అందించింది. ఈ వర్క్‌షాప్ ముగింపు నివేదికను నవంబర్ 2023లో ఇండోనేషియాలో జరగనున్న G20 సమ్మిట్‌కు అందించబడుతుంది భావిస్తున్నారు.

వాషింగ్టన్‌లో తొలి యూఎస్ ఆసియాన్ సెంటర్ ఏర్పాటు

అధికారిక ఆసియాన్ ఎంగేజ్‌మెంట్‌లను సులభతరం చేసే మొట్టమొదటి యూఎస్-ఆసియాన్ కేంద్రాన్ని వాషింగ్టన్‌లో ఏర్పాటు చేస్తున్నామని యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ప్రకటించారు. ఈ నెలలో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన యునైటెడ్ స్టేట్స్ మరియు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమ్మిట్‌లో యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఈ ప్రకటన చేశారు.

యూఎస్-ఆసియాన్ కేంద్రం యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మరియు అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంగా ఉంటుంది. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య మరియు భద్రతతో సహా అనేక రంగాలలో యునైటెడ్ స్టేట్స్ మరియు ఆసియాన్ మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. ఈ కేంద్ర 2024 నాటికీ అందుబాటులోకి రానుంది.

హాంగ్‌జౌ ఆసియన్ గేమ్స్ 2023లో భారత బృందానికి స్పాన్సర్‌గా అమూల్

సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8, 2023 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న 19వ ఆసియా క్రీడలు 2022 కోసం భారత పాడి పరిశ్రమ సహకార సంస్థ అమూల్ భారత అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఆసియా క్రీడలకు భారత బృందాన్ని పంపడానికి అయ్యే ఖర్చులను భరించేందుకు అమూల్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)కి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. క్రీడల సందర్భంగా అమూల్ తన ఉత్పత్తులను భారతీయ అథ్లెట్లకు కూడా అందిస్తుంది.

ప్రపంచంలో ఒలింపిక్ క్రీడల తర్వాత ఆసియా క్రీడలు రెండవ అతిపెద్ద బహుళ-క్రీడా ఈవెంటుగా నిర్వహించబడతాయి. ఈ క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆసియా నలుమూలల నుండి క్రీడాకారులు దీనిలో పాల్గొంటారు. 2023 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8, 2023 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతాయి.

భారత వైమానిక దళం యొక్క మెగా మిలటరీ డ్రిల్ త్రిశూల్‌ ప్రారంభం

భారత వైమానిక దళం యొక్క మెగా మిలిటరీ డ్రిల్ త్రిశూల్‌ను సెప్టెంబర్ 4 - 11, 2023 తేదీల మధ్య భారతదేశం యొక్క ఉత్తర మరియు పశ్చిమ సెక్టార్‌లలో, చైనా మరియు పాకిస్తాన్‌లతో సరిహద్దులలో నిర్వహించబడింది. త్రిశూల్ అనేది భారత వైమానిక దళం యొక్క అతిపెద్ద మరియు అత్యంత సంక్లిష్టమైన శిక్షణా వ్యాయామాలలో ఒకటి. ఇది భారత వైమానిక దళం యొక్క కార్యాచరణ సంసిద్ధత మరియు సామర్థ్యాలను వివిధ సందర్భాల్లో పరీక్షించేందుకు ఇది రూపొందించబడింది.

ఈ డ్రిల్‌లో ఫైటర్ జెట్‌లు, రవాణా విమానాలు మరియు హెలికాప్టర్‌లతో సహా భారత వైమానిక దళం యొక్క వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కింద ఉన్న అన్ని ఫ్రంట్‌లైన్ల ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుంది. భారత సైన్యం మరియు భారత నావికాదళం వంటి ఇతర భారత సైనిక శాఖలతో భారత వైమానిక దళం తన పరస్పర చర్యను అభ్యసించడానికి కూడా ఈ డ్రిల్ ఒక అవకాశం కల్పిస్తుంది. ఈ డ్రిల్‌లో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ మరియు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ వంటి స్నేహపూర్వక విదేశీ వైమానిక దళాల భాగస్వామ్యం కూడా ఉంటుంది.

చైనా, పాకిస్థాన్‌లతో భారత్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ డ్రిల్‌ జరుగుతోంది. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా తన సైనిక ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా, కాశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోంది. త్రిశూల్ డ్రిల్ చైనా, పాకిస్థాన్‌లకు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్న సందేశం ఇస్తుంది.

వాయిస్ ఎనేబుల్డ్ యూపిఐ పేమెంట్ ఫీచర్‌ ప్రారంభించిన ఎన్‌పిసిఐ

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాయిస్-ఎనేబుల్డ్ యూపీఐ చెల్లింపు ఫీచర్‌లను ప్రారంభించింది. "హలో! యూపీఐ" అని పిలవబడే ఈ  ఫీచర్ ప్రస్తుతం హిందీ మరియు ఆంగ్లంలో వాయిస్ ఆదేశాలను ఉపయోగించి చెల్లింపులు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది ప్రస్తుతం ఎన్‌పిసిఐ యొక్క యూపీఐ యాప్ మరియు కొన్ని ఇతర యూపీఐ యాప్‌లలో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని యూపీఐ యాప్‌లకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

హలో! యూపీఐ అనేది చెల్లింపులు చేయడానికి అనుకూలమైన మరియు సులభమైన మార్గం. టైప్ చేయడం లేదా చదవడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణంలో ఉన్నవారికి లేదా చేతులు, చూపు లేని వారికి ఇది సహాపడుతుంది. వాయిస్-ఎనేబుల్డ్ యూపీఐ చెల్లింపుల ప్రారంభం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రదేశానికి ఒక ముఖ్యమైన పరిణామం. ఇది యూపీఐ చెల్లింపులకు మరింత జనాదరణ తెస్తుందని మరియు విస్తృత శ్రేణి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

నిజాం కాలం నాటి పత్రాలు కలిగి ఉన్న మరాఠాలకు ఓబీసీ సర్టిఫికెట్లు

నిజాం కాలం నాటి విద్యా ధృవీకరణ పత్రాలు ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన మరాఠాలకు కుంబీ కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజాం కాలం నాటి రికార్డులను కలిగి ఉన్న వ్యక్తుల నుండి అనేక అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. అర్హులైన వారందరికీ అందాల్సిన ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇతర వెనుకబడిన తరగతులకి చెందిన వ్యక్తి అని ధృవీకరించే పత్రం. ఇది విద్యా సంస్థలలో ప్రవేశం పొందడం మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందడం వంటి అనేక ప్రయోజనాల కోసం అవసరం. నిజాం కాలం నాటి రికార్డులతో ఓబీసీ సర్టిఫికెట్ పొందే ప్రక్రియను సులభతరం చేస్తామని ప్రభుత్వం తెలిపింది. నిజాం కాలం నాటి రికార్డులు ఉన్న వ్యక్తులు ఓబీసీ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో లేదా స్థానిక తహసీల్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవలని కోరింది.

పిడబ్ల్యుడి సాధికారత కల్పించేందుకు 5 రాష్ట్రాలతో అమెజాన్ ఇండియా ఒప్పందం

వికలాంగులకు (పిడబ్ల్యుడి) సాధికారత కల్పించడానికి మరియు ప్రధాన స్రవంతి శ్రామికశక్తిలో వారి భాగస్వామ్యాన్ని ఎనేబుల్ చేయడానికి ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో అమెజాన్ ఇండియా అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసింది. ఈ ఐదు రాష్ట్రాలలో హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మరియు తమిళనాడులు ఉన్నాయి.

ఈ ఎంఓయూలో భాగంగా అమెజాన్ ఇండియా పిడబ్ల్యుడి అభ్యర్థులకు కస్టమర్ సర్వీస్, కార్యకలాపాలు మరియు ఐటీతో సహా వివిధ పాత్రలలో నైపుణ్యం మరియు శిక్షణను అందిస్తుంది. తన కార్యకలాపాల నెట్‌వర్క్‌లో పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. పిడబ్ల్యుడి ఉద్యోగుల కోసం మరింత అందుబాటులో ఉండే మరియు సమగ్రమైన కార్యాలయాన్ని రూపొందించడానికి అమెజాన్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుంది.

అమెజాన్ ఇండియా మరియు ఐదు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం స్వాగతించదగిన పరిణామం. దివ్యాంగుల సాధికారత మరియు ప్రధాన స్రవంతి శ్రామికశక్తిలో వారి భాగస్వామ్యాన్ని ఎనేబుల్ చేయడం కోసం ఇది సరైన దిశలో ఒక అడుగు. ఐదు రాష్ట్రాల్లోని దివ్యాంగుల జీవితాలపై ఎంఓయూ సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

వనాటు ప్రధానమంత్రిగా సాటో కిల్మాన్‌

వనాటు పార్లమెంటు సెప్టెంబరు 4, 2023న సాటో కిల్‌మాన్‌ను తమ నూతన ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఆగస్ట్ 2023లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన బాబ్ లౌగ్‌మాన్ తర్వాత కిల్‌మాన్ నియమితులయ్యారు. ఉపాధ్యాయుడు మరియు వ్యాపారవేత్త అయినా కిల్మాన్ 2012 నుండి వనాటు పార్లమెంటులో సభ్యుడుగా ఉన్నాడు. ఆయన తన్నా ద్వీపం నుండి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు

వనాటు అనేది దాదాపు 80 ద్వీపాలతో రూపొందించబడిన దక్షిణ పసిఫిక్ మహాసముద్రంని చిన్న ద్విప దేశం. ఈ ద్వీపాలు పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. దీని రాజధాని నగరం పోర్ట్ విలా, దీని జనాభా 3.19 లక్షలు, అధికారిక భాషలు బిస్లామా, ఫ్రెంచ్, ఇంగ్లీష్. ఇది ఓషియానియా (ఆస్ట్రేలియా) ఖండం పరిధిలోకి వస్తుంది.

Post Comment