Advertisement
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 14 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 14 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 14 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఈఎస్‌ఐ పథకం కింద 19.42 లక్షల మంది కొత్త కార్మికులు

ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం 2023 ఆగస్టు నెలలో 19.42 లక్షల మంది కొత్త ఉద్యోగులు ఈఎస్‌ఐ పథకం కింద నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. దీనితో పాటుగా ఈ ఏడాది 75 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా తమ ఖాతాలు తెరిచినట్లు నివేదించింది.

2023 ఆగస్టు నెలలో ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సామాజిక భద్రతా గొడుగు కింద దాదాపు 24,849 కొత్త సంస్థలు రిజిస్టర్ చేయబడ్డాయి. దీనితో ఈఎస్‌ఐ పథకం పరిధిలోని ఉద్యోగుల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ఈ నెలలో నమోదు కాబడ్డ మొత్తం 19.42 లక్షల మంది ఉద్యోగుల్లో 9.22 లక్షల మంది ఉద్యోగులు 25 ఏళ్లలోపు  ఉన్నవారు ఉన్నట్లు తెలిపింది. అలానే ఇందులో 3.73 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు కూడా తెలిపింది. ఇది మొత్తం ఉద్యోగులలో 47.48%గా ఉన్నందున దేశంలోని యువత కోసం మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయని డేటా వెల్లడిస్తోంది.

ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్‌ఐ) అనేది ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారానిర్వహించబడే ఒక కార్మిక సామాజిక పథకం. ఇది భారతీయ ఉద్యోగులకు ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, జీవిత బీమా వంటి సామాజిక భద్రత అందిస్తుంది. ఈఎస్‌ఐ ఉద్యోగులకు చెల్లించే స్థూల జీతంపై లెక్కించబడుతుంది. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం, యజమాని వేతనంలో 3.25%, మరియు ఉద్యోగి 0.75% వేతనాన్ని కాంట్రిబ్యూటరీ ఫండ్‌కు జమ చేస్తారు. ఇది కష్ట సమయాల్లో ఉద్యోగులకు బీమా రక్షణను అందించడానికి ఉపయోగించబడుతుంది.

2050 నాటికి కార్బన్ నెగెటివ్ దిశగా అభివృద్ధి చెందిన దేశాలు

అభివృద్ధి చెందిన దేశాలను 2050 నాటికి కార్బన్ తటస్థంగా కాకుండా కార్బన్ ప్రతికూలంగా మార్చాలని భారతదేశం కోరుకుంటోంది. 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాల ప్రపంచ లక్ష్యాన్ని సాధించడానికి ఇది అవసరమని భారతదేశం వాదిస్తుంది. అదే సమయంలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ గ్రీన్ ఆర్థిక వ్యవస్థలను వృద్ధి చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది భావిస్తుంది.

అభివృద్ధి చెందిన దేశాలు గత శతాబ్దంలో అత్యధిక గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసినందున, వాతావరణ మార్పులకు వారు చారిత్రక బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే మరింత త్వరగా క్లీన్ ఎనర్జీ ఎకానమీకి మారడానికి వారికి ఆర్థిక మరియు సాంకేతిక వనరులు కూడా అందుబాటులో ఉన్నట్లు అభిప్రాయపడింది.

గ్లోబల్ వార్మింగ్‌ 1.5°C కంటే ఎక్కువ పెరగకుండా, పారిస్ ఒప్పందంలో పేర్కొన్నట్లుగా 2030 నాటికి ఉద్గారాలను 45% తగ్గించి, 2050 నాటికి నికర సున్నాకి చేరుకోవాలని అగ్ర దేశాలకు పిలుపునిచ్చింది. శిలాజ ఇందనలపై ఆధారపడటాన్ని వీలైనంత త్వరగా తగ్గించుకోవాలని కోరింది.

భారతదేశం కూడా తన స్వంత వాతావరణ లక్ష్యాల సాధనలో పురోగతి చూపిస్తుంది. భారత్ 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా పునరుత్పాదక శక్తి మరియు ఇంధన సామర్థ్యలపై భారీగా పెట్టుబడి పెడుతోంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల మద్దతు లేకుండా వాతావరణ లక్ష్యాలను సాధించలేమని భారత్ వాదిస్తోంది.

భారతదేశం యొక్క ప్రతిపాదనకు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల నుండి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ దేశాలు కార్బన్ ప్రతికూలంగా మారాలని ఆశించడం అన్యాయమని వాదించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, భారతదేశం యొక్క వైఖరికి అనేక మంది శాస్త్రవేత్తలు, నిపుణులు మద్దతు అందిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను నివారించడానికి మరింత ప్రతిష్టాత్మకమైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత అగ్రదేశాలపై ఉంది

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు, నగరాలు, వ్యాపారాలు, సంస్థలు నికర-సున్నా ఉద్గారాలను పొందడానికి ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. చైనా, యునైటెడ్ స్టేట్స్. రష్యా, భారత్, జపాన్ మరియు యూరోపియన్ యూనియన్ వంటి అగ్రదేశాలు ఇప్పటికే నికర-సున్నా లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ఇవి ప్రపంచ ఉద్గారాలలో 76% కవర్ చేస్తున్నాయి.

 అబుదాబిలో ఇంటెర్నేషన్ కౌన్సిల్ ఆన్ ఆర్కైవ్స్ కాంగ్రెస్

ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ ఆర్కైవ్స్ కాంగ్రెస్ 2023 సేమావేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో అక్టోబర్ 9-13, 2023 వరకు నిర్వహించబడ్డాయి. 1950లో ప్రారంభ సెషన్ నుండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వీటిని నిర్వహిస్తున్నారు. నాలెడ్జ్ సొసైటీలను మెరుగుపరచడం అనే థీమ్‌తో ఈ సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశాలకు 135 దేశాల నుండి 3,000 మంది ఆర్కైవిస్ట్‌లు మరియు రికార్డుల నిపుణులు హాజరయ్యారు. ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లో 500 కంటే ఎక్కువ ప్రెజెంటేషన్‌లు, వర్క్‌షాప్‌లు మరియు అనేక రకాల అంశాలపై ప్యానెల్ చర్చలు జరిగాయి. ఆధునిక ప్రపంచంలో విశ్వసనీయ సమాచారానికి ప్రాప్యత యొక్క పరివర్తన శక్తిని ఈ కాంగ్రెస్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ, సంస్థల రికార్డులు మరియు మానవ సమాజాలను ప్రతిబింబించే మల్టీమీడియా పత్రాలకు సంరక్షించడంలో ఆర్కైవ్‌లు పోషించే ముఖ్యమైన పాత్రను ఇది హైలైట్ చేసింది.

21వ శతాబ్దపు సమాచార సవాళ్లు కేవలం ఆర్కైవ్‌లు మరియు రికార్డుల నిపుణులకు సంబంధించినవి మాత్రమే కావని గుర్తుచేసింది. ఇందులో లైబ్రేరియన్‌లు, మ్యూజియం నిపుణులు, డేటా మేనేజర్‌లు, జర్నలిస్టులు మరియు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.

ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ ఆర్కైవ్స్ 1895లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం పారిస్ నగరంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డులు మరియు ఆర్కైవ్ నిపుణుల ప్రాతినిధ్యం ద్వారా ప్రపంచ ఆర్కైవల్ వారసత్వం యొక్క ప్రభావవంతమైన నిర్వహణ మరియు సంరక్షణకు బాధ్యత వహిస్తుంది. ఐసీఏ అన్ని ఫార్మాట్‌లలో రికార్డులు, ఆర్కైవ్‌లు మరియు డేటాను భద్రపరుస్తుంది. ఈ డేటా ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం మరియు సుపరిపాలనకు హామీ కల్పిస్తాయి. అలానే రేపటి తరానికి ప్రపంచ సాంస్కృతిక మరియు సాక్ష్యాధార వారసత్వంగా ఉపయోగపడతాయి.

కాంబ్రియన్ పెట్రోల్ 2023 మిలిటరీలో భారత సైన్యంకు బంగారు పతకం

యూకే లోని వేల్స్‌లో జరిగిన కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ 2023 ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో భారత సైన్యం బంగారు పతకాన్ని గెలుచుకుంది. 3/5 గూర్ఖా రైఫిల్స్ (ఫ్రాంటియర్ ఫోర్స్) నుండి ఒక బృందం యూకే లోని వేల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్‌సైజ్‌లో భారత సైన్యం తరపున ప్రాతినిధ్యం వహించిందని ఆర్మీ తెలిపింది.

కేంబ్రియన్ పెట్రోల్ అనేది సైనికుల శారీరక మరియు మానసిక ఓర్పును పరీక్షించే ఒక కఠినమైన సైనిక వ్యాయామం. ఈ వ్యాయామంలో పర్వత ప్రాంతాలపైగా 54-కిలోమీటర్ల పెట్రోలింగ్ ఉంటుంది. దీనిలో భాగంగా నావిగేషన్, ప్రథమ చికిత్స మరియు ఆయుధాల నిర్వహణ వంటి అనేక టాస్కులను సైనిక బృందాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పెట్రోల్ మానవ ఓర్పు, బృంద స్ఫూర్తికి అంతిమ పరీక్షగా పరిగణించబడుతుంది. దీనిని ప్రపంచ మిలిటరీల మధ్య మిలిటరీ పెట్రోలింగ్ యొక్క ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు.

కేంబ్రియన్ పెట్రోలింగ్‌లో భారత ఆర్మీ జట్టు విజయం సాధించడం భారత సైన్యం యొక్క అత్యున్నత శిక్షణ మరియు వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. కేంబ్రియన్ పెట్రోల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సైనిక విన్యాసాలలో ఒకటి కాబట్టి ఇది కూడా ఒక ముఖ్యమైన విజయం.

చెన్నైలో సాగర్ పరిక్రమ పదో దశ ప్రారంభం

అక్టోబర్ 13న సాగర్ పరిక్రమ పదో దశను కేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తం రూపాలా చెన్నై నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతర ఆయన చెన్నై పోర్టు నుండి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సుజయ్‌లో ఆంద్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టు వరకు ప్రయాణించారు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో సాగర్ పరిక్రమ ఒకటన్నారు. మత్స్యకారుల అవసరాలు, సవాళ్లను అర్థం చేసుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

సాగర్ పరిక్రమ అనేది దేశంలోని మొత్తం తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారుల సంఘాలను చేరుకోవడానికి ఉద్దేశించిన ఔట్రీచ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచడం, వారికి ఆర్థిక సహాయం అందించడం, సంబంధిత రంగంలో నైపుణ్య శిక్షణ అందించడం మరియు మార్కెట్‌లకు ప్రాప్యత వంటివి ఉన్నాయి. ఈ పదో దశ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇది డిసెంబర్ 2023లో ముగుస్తుంది.

Post Comment