Advertisement
ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ & రైల్వే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
Scholarships

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ & రైల్వే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్

ఆర్‌పిఎఫ్ & ఆర్‌పిఎస్ఎఫ్ చెందిన ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్  2008-09 విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఆధ్వర్యంలో అమలుచేస్తున్న స్కాలర్షిప్ పథకాన్ని విధి నిర్వహణలో చనిపోయిన లేదా గాయపడిన లేదా పదివి విరమణ చేసిన లేదా సర్వీసులో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ కుటుంబాలకు చెందిన విడో మహిళలకు లేదా వారి పిల్లలకు, ఉన్నత విద్య ప్రోత్సహంలో భాగంగా దీన్ని అమలుచేస్తున్నారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు 2,250/- రూపాయలు, పురుషులకు 2,000/- రూపాయలు అందజేస్తున్నారు.

స్కాలర్షిప్ పేరు ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ ఆర్‌పిఎఫ్ & ఆర్‌పిఎస్ఎఫ్
ఎవరు అర్హులు  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ కుటుంబాలకు
దరఖాస్తు ముగింపు తేదీ 15-04-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 22-04-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 22-04-2022

ఈ స్కీమ్ కింద ఏడాదికి గరిష్టంగా 150 స్కాలర్షిప్'లు ప్రకటిస్తున్నారు. ఇందులో 50 శాతం స్కాలర్షిప్'లు మహిళలకు కేటాయిస్తారు. ఇవి దేశ వ్యాప్తంగా ఉండే రైల్వే జోన్ల కోటా ఆధారంగా అందజేస్తారు. ఏపీ మరియు తెలంగాణ పరిధిలో ఉండే సౌత్ సెంట్రల్ రైల్వే మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 6, 5 చెప్పున మొత్తం 11 స్కాలర్షిప్'లు అందుబాటులో ఉన్నాయి.

ఎలిజిబిలిటీ

ఉగ్రదాడులు, క్రిమినల్ దాడులు వలన విధి నిర్వహణలో మృతి చెందిన మరియు త్రీవంగా గాయపడిన లేదా పదివి విరమణ చేసిన లేదా సర్వీసులో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ కుటుంబాలకు చెందిన విడో మహిళలకు లేదా వారి పిల్లలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పథకం ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, వెటర్నరీ, ఫార్మసీ, ఏంసిఏ, ఎంబీఏ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే వర్తింపజేస్తారు. విద్యార్థి 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఈ పథకం గరిష్టంగా ఐదేళ్లు అందిస్తారు. దీనికోసం అభ్యర్థి ప్రతి ఏడాది రెన్యువల్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రెన్యువల్ అయ్యేందుకు, ముందటి ఏడాది అకాడమిక్ పరీక్షలలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుండి ఆన్‌లైన్ విధానంలో  సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ కింది ధ్రువపత్రాలను అందుబాటులో ఉండుచుకోవాలి.

  • అకాడమిక్ పాస్ సర్టిఫికెట్లు
  • PPO/డిశ్చార్జ్ సర్టిఫికెట్ (కేటగిరి I నుండి IV వరకు)
  • డిజాబిలిటీ సర్టిఫికెట్ (కేటగిరి II వాళ్లకు)
  • డెర్త్ సర్టిఫికెట్ (కేటగిరి I  వాళ్లకు)

వివిధ స్థాయిల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, అర్హులైన విద్యార్థులకు కింది కేటగిరిల ప్రాధాన్యత ఆధారంగా స్కాలర్షిప్ ఆమోదిస్తారు. స్కాలర్షిప్ కోసం ఎంపికైన విద్యార్థులకు ప్రధానమంత్రి రాసిన వ్యక్తిగత లెటర్ అందజేస్తారు.

కేటగిరి I ఉగ్రదాడులలో చనిపోయిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి II ఉగ్రదాడులలో గాయపడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి III పదవి విరమణ చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి IV సర్వీస్ ఉండే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఫ్యామిలీస్

Post Comment