Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 25, 2023
Magazine 2022

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 25, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 25, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల మహిళల టి20ఐ ఫైనల్‌లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో ఓడించి భారత్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలి స్వర్ణ పతకం లభించగా, రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్తాన్ జట్టును ఓడించి బంగ్లాదేశ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

ఆసియా క్రీడల్లో 2010 నుండి మహిళల క్రికెట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు టోర్నమెంట్లు జరగగా అందులో రెండు సార్లు పాకిస్తాన్ మహిళల జట్టు విజేతగా నిలవగా, భారత్ మహిళల జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంటులో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, మలేషియా మరియు ఇండోనేషియా దేశాలు పాల్గొన్నాయి. ఈ ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఈవెంట్‌లో పతకం లేకుండా పాకిస్థాన్ తిరిగి వెళ్లడం ఇదే తొలిసారి.

న్యూ ఢిల్లీలో ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2023

న్యూఢిల్లీలోని ఫిక్కీ ఫెడరేషన్ హౌస్‌లో 'ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2023'ను ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ ప్రారంభించారు. ఈ రెండు రోజుల సమ్మిట్ దేశంలో గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ఈ సదస్సును నిర్వహించింది.

ఈ సదస్సు ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ టు నెట్ జీరో: ఎ రోడ్ మ్యాప్ ఫర్ 2070 అనే థీమ్‌తో జరిగింది. ఈ సమ్మిట్‌కు భారతదేశం మరియు విదేశాల నుండి 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రముఖులు మరియు ఇంధన రంగానికి చెందిన నిపుణులు ఉన్నారు.

ఈ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం యొక్క శక్తి పరివర్తనకు సంబంధించిన అనేక అంశాలపై చర్చిస్తారు, వాటితో సహా భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో పునరుత్పాదక శక్తి పాత్ర, భారతదేశ విద్యుత్ రంగాన్ని డీకార్బనైజ్ చేయడంలో సవాళ్లు మరియు అవకాశాలు, గ్రీన్ హైడ్రోజన్ మరియు కార్బన్ క్యాప్చర్ మరియు స్టోరేజ్ వంటి కొత్త శక్తి సాంకేతికతల అభివృద్ధి, భారతదేశ శక్తి పరివర్తనకు ఫైనాన్సింగ్ వంటి అంశాల కోసం కూడా చర్చించారు.

ఈ సదస్సు భారతదేశంలో ఇంధన పరివర్తన అంశంపై చాలా ఆసక్తిని మరియు చర్చను సృష్టించింది. స్వచ్ఛమైన, స్థిరమైన మరియు సరసమైన ఇంధన భవిష్యత్తుకు భారతదేశం యొక్క పరివర్తనను వేగవంతం చేయడానికి ఈ శిఖరాగ్ర సమావేశం సహాయపడుతుందని భావిస్తున్నారు.

రోజ్‌గార్ మేళా కింద 51000 అపాయింట్‌మెంట్‌లు పంపిణీ

రోజ్‌గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా చేరిన రిక్రూట్‌లకు దాదాపు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌లను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పంపిణీ చేశారు. రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి అవకాశాలను సృష్టించడానికి మరియు యువతకు సాధికారత కల్పించడానికి అక్టోబర్ 2022లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి మేళా కార్యక్రమం. ఈ రోజ్‌గార్ మేళా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా క్రమం తప్పకుండా నిర్వహించబడతాయి.

వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల నుండి కొత్తగా రిక్రూట్ అయిన అభ్యర్థులకు రోజ్‌గార్ మేళా కింద నియామక పత్రాలు పంపిణీ చేయబడతాయి. రోజ్‌గార్ మేళా దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమం. రోజ్‌గార్ మేళా కింద 2023 చివరి నాటికి 10 లక్షల నియామక పత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 46 పట్టణాలలో ఈ మేళ నిర్వహించబడుతుంది.

భారత్ డ్రోన్ శక్తి 2023 పేరుతొ మొట్టమొదటి డ్రోన్ ఎగ్జిబిషన్

ఘజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్ బేస్‌లో భారత్ డ్రోన్ శక్తి-2023 పేరుతొ మొట్టమొదటి డ్రోన్ ఎగ్జిబిషన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా నిర్వహించాయి. సెప్టెంబరు 25 & 26, 2023 తేదీలలో నిర్వహించిన ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న75 డ్రోన్ స్టార్టప్‌లు పాల్గొన్నాయి.

భారత్ డ్రోన్ శక్తి 2023 ప్రారంభోత్సవం తర్వాత మొదటి C-295 MW రవాణా విమానంను భారత వైమానిక దళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టరు. భారత వైమానిక దళం అవ్రో విమానాల స్థానంలో 56 ఎయిర్‌బస్ C-295 విమానాల కొనుగోలును భారతదేశం అధికారికం చేసింది. ఈ సమావేశం భారత్ డ్రోన్ శక్తి 2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చే నినాదంతో ముగిసింది.

ఫార్మా ఆర్ & డీ పై జాతీయ విధానాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, భారతదేశంలోని ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి మరియు ఆవిష్కరణలపై జాతీయ విధానాన్ని ఆగస్టు 18, 2023న ప్రారంభించారు . ఈ విధానం ఫార్మాస్యూటికల్స్ మరియు వైద్య పరికరాల రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పాలసీలో ఫార్మా మరియు మెడ్‌టెక్ రంగాలలో స్టార్టప్‌లు మరియు వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి అనేక నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించనుంది. ఫార్మా-మెడ్‌టెక్ సెక్టార్‌లో నేషనల్ పాలసీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ ప్రారంభించడం ఫార్మా మరియు మెడ్‌టెక్ పరిశ్రమలలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ విధానం కొత్త మరియు మెరుగైన మందులు మరియు వైద్య పరికరాల అభివృద్ధికి దారితీస్తుందని భావిస్తున్నారు.

బెంగాల్‌లోని దిఘా హార్బర్‌లో కొత్త చేప జాతులు

భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని దిఘ మోహన ఫిషింగ్ హార్బర్‌లో కొత్త జాతి చేప కనుగొనబడింది. సాధారణంగా వీటిని గర్నార్డ్స్ లేదా సీ-రాబిన్స్ అని పిలుస్తారు. ఇది ట్రిగ్లిడే కుటుంబానికి చెందినది. దీనికి పేటరీగోట్రిగ్లా ఇంటర్‌మెడికా అని పేరు పెట్టారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ చేశారు. ఈ కొత్త జాతులు నారింజ రంగులో అస్థి తల మరియు పాయింటెడ్ రోస్ట్రల్ వెన్నెముక వంటి దాని ప్రత్యేక భౌతిక లక్షణాలను కలిగి ఉన్నాయి.

మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్‌తో ఎంపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రభుత్వ పాఠశాలల్లో లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టేందుకు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్‌తో ఎంపీ ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యింది. ఇందులో భాగంగా 9000 మధ్యప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 'సాక్షం' ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టనుంది. దీని కోసం 18,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ అందించనున్నారు.

ఈ సాక్షం ప్రోగ్రామ్ అనేక రకాలైన లైఫ్ స్కిల్స్ అంశాలను కవర్ చేస్తుంది, వాటితో స్వీయ-అవగాహన, కమ్యూనికేషన్, ప్రాబ్లెమ్ సొల్వింగ్, డెసిసిన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ మరియు టీమ్‌వర్క్ స్కిల్స్‌, కెరీర్ ప్లానింగ్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని 9,000 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయబడుతుంది. 6 నుండి 10వ తరగతి వరకు పది లక్షల మంది కౌమారదశలో ఉన్నవారిని ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంటుంది.

కోవిడ్-19 కంటే 'డిసీజ్ X' 20 రెట్లు ప్రాణాంతకం అయ్యే అవకాశం

2020లో యూకే యొక్క వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు అధ్యక్షత వహించిన ఆరోగ్య నిపుణుడు డేమ్ కేట్ బింగ్‌హామ్ ప్రకారం కోవిడ్-19 కంటే 'డిసీజ్ X' 20 రెట్లు ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డిసీజ్ X అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత రూపొందించబడిన భవిష్యత్ కాలంలో వచ్చే రోగం, ఇది ప్రస్తుతం తెలియని వ్యాధికారక కారణంగా సంభవించే సంభావ్య కొత్త మహమ్మారిని సూచిస్తుంది. వ్యాధి X అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధిగా ఉండే అవకాశం ఉన్నట్లు, ఇది అధిక మరణాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.

వాతావరణ మార్పులు వ్యాధుల పంపిణీలో మార్పులకు, కొత్త వ్యాధుల ఆవిర్భావానికి దారితీస్తున్నట్లు తెలిపింది. ప్రపంచీకరణ ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తున్నట్లు, దీనికి అత్యధిక జనసాంద్రతకు కారణమౌతున్న పట్టణీకరణ ఆజ్యం పోస్తున్నట్లు పేర్కొంది. అలానే యాంటీబయాటిక్స్ యొక్క మితిమీరిన వినియోగం యాంటీబయాటిక్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఆవిర్భావానికి దారి తీస్తుంది, ఇది ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టతరం చేస్తుంద.

Post Comment