Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 22 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 22 జనవరి 2024

January 22, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ముఖ్యాంశాలు

అయోధ్యలో కొత్తగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిర్‌లో విగ్రహ ప్రతిష్ఠాపనకు గుర్తుగా రామ్ లల్లా యొక్క "ప్రాణ్ ప్రతిష్ఠ" వేడుక జనవరి 22, 2024న జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన పీఎం నరేంద్ర మోదీ, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర 121 మంది వైదిక బ్రాహ్మణులతో కలిసి పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ మార్గదర్శకత్వంలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అభిజీత్ ముహూర్తం సంధర్బంగా ఈ వేడుక జరిగింది. జనవరి 22 మధ్యాహ్నం 12.29 నుండి 12.30 గంటల మధ్య కేవలం 48 సెకన్ల సమయంలో ఈ తంతు పూర్తిఅయింది.

ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ సహా దేశవ్యాప్తంగా నటులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మొదలైన వారితో సహా సుమారు 7,000 మంది వివిఐపీలు హాజరయ్యారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతులతో రూపొందించబడిన 51 అంగుళాల ఏకరాతి బలరాముడు విగ్రహం, తామరపువ్వుపై మనోహరంగా ప్రదర్శించబడింది.

అయోధ్య రామమందిరం సాంప్రదాయ నాగర నిర్మాణ శైలిలో నిర్మించబడింది. అయోధ్య రామమందిరం 2.77 ఎకరాల విస్తీరణంలో 76 మీటర్లు (250 అడుగులు) వెడల్పు, 120 మీటర్లు (380 అడుగులు) పొడవు మరియు 49 మీటర్లు (161 అడుగులు) ఎత్తుతో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే రామమందిరంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఈ ఆలయంలో 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉన్నాయి.

మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. ఇక్కడ నృత్య, రంగ్, సభా, ప్రార్థనా, కీర్తనా పేర్లతో మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. భక్తులు ఆలయం లోపలికి ప్రవేశించాలి అంటే తూర్పువైపు ఉన్న సింహ ద్వారం నుంచి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకారంలో భారీ ప్రహరీని నిర్మించారు. ఈ ప్రహరీ 4 మూలల్లో సూర్యు భగవానుడు, దేవీ భగవతి, వినాయకుడు, శివుడి మందిరాలు ఉన్నాయి. ఉత్తర భాగంలో అన్న పూర్ణా దేవి, దక్షిణ భాగంలో హనుమాన్ గుడి నిర్మించారు.

రామమందిరానికి అసలు రూపకల్పన 1988లో అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబంచే రూపొందించబడింది. వీరి 15 తరాల కుటుంబం సోమ్‌నాథ్ ఆలయంతో సహా ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనకు సహకరించారు. అయోధ్య రామమందిర  ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపురా, అతని ఇద్దరు కుమారులు నిఖిల్ సోంపురా మరియు ఆశిష్ సోంపురా కూడా వాస్తుశిల్పులుగా ఉన్నారు.

అయోధ్య రామమందిర నిర్మాణంలో ముఖ్యమైన తేదీలు

అయోధ్యలో ప్రస్తుతం నిర్మించిన రామమందిర ప్రదేశం 16వ శతాబ్దంలో నిర్మించబడిన బాబ్రీ మసీదు యొక్క పూర్వ ప్రదేశం. ఇది రాముడు జన్మస్థలం అనే కారణంతో 1992లో హిందూ కార్యకర్తల ద్వారా బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. 2019లో ఈ వివాదాస్పద భూమిని హిందువులకు దేవాలయ నిర్మాణానికి ఇవ్వాలని, ముస్లింలకు మసీదు నిర్మించేందుకు వేరే చోట భూమిని ఇవ్వాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020 లో అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభించ బడ్డాయి.

  • 1528లో అయోధ్యలో రాముడి జన్మస్థలమని హిందువులు భావించే చోట మొఘల్ చక్రవర్తి బాబర్ మసీదును నిర్మించాడు.
  • 1853-1949 మధ్య కాలంలో ఈ స్థలం గురించి హిందూ-ముస్లింల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతూ వచ్చాయి. దీంతో బ్రిటిష్ వాళ్లు మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకు, మసీదు వెలుపలి ప్రాంతాన్ని హిందువులకు కేటాయించారు.
  • 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం బయటపడింది. దీని మోసం ముస్లింలు ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో మసీదును వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి మసీదుకు తాళం వేశారు.
  • 1950లో మసీదు లోపల బయటపడిన రామ్ లల్లా విగ్రహానికి పూజలు చేసేందుకు అను మతించాలని ఫైజాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటి షన్లు దాఖలయ్యాయి.
  • 1959లో నిర్మోహీ అఖాడా మూడో పార్టీగా పిటిషన్ వేసింది.
  • 1961లో మసీదు లోపలి రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్నీ వక్స్ బోర్డు కోర్టుకు వెళ్లింది.
  • 1986లో మసీదు తలుపులు తెరవాలని, హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
  • 1962 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. తర్వాత చెలరేగిన హింసలో 2వేల మందికి పైగా చనిపోయారు.
  • 2001లో బాబ్రీ కూల్చివేత, హింస కేసులో స్పెషల్ జడ్జి ఆడ్వాణీ, కల్యాణ్ సింగ్ సహా 13 మందిని నిర్దోషిగా ప్రకటించారు.
  • 2002లో హిందూ భక్తులు వెళ్తున్న రైలుకు గోద్రాలో నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన హింనలో 2 వేల మందికి పైగా మృతి చెందారు.
  • 2010లో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూభాగాన్ని మూడొంతులుగా విభజించి. రెండు వంతులను హిందూ.పార్టీలకు, ఒక వంతును వక్స్ బోర్డుకు కేటాయించింది.
  • 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్చుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
  • 2017 లో  మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ, ముస్లిం పార్టీలకు సూచించింది. దీంతో పాటు పలువురు బీజేపీ నేతలపై నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది.
  • 2019 మార్చి 8న అయోధ్య కేసు మధ్యవర్తి త్వానికి సుప్రీంకోర్టు ప్యానె లను ఏర్పాటు చేసింది. 8వారాల్లోగా ప్రొసీడింగులను పూర్తి చేయాలని ఆదేశించింది.
  • 2019 నవంబరు 9న ఆయోధ్యపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరిం చింది. వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్ లల్లాకే కేటాయించింది. మసీదు నిర్మాణానికి 5ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం, యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
  • 2020 ఫిబ్రవరి 5న అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 15 సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేసింది.
  • 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.
  • 2024 జనవరి 22న భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది.

అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ ప్రారంభం

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్-2023 ని ప్రారంభించింది. ఇది హర్యానాలోని సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్‌లో ప్రత్యామ్నాయ జీవనోపాధిని అందించే ప్రత్యేక కార్యక్రమం. ఈ ప్రదేశాలలో ప్రకృతి పర్యాటకాన్ని బలోపేతంతో పాటుగా స్థానిక రామ్‌సర్ సైట్‌ల చుట్టూ స్థానిక కమ్యూనిటీకి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించనున్నారు. అమృత్ ధరోహర్ పథకం 2023-24 బడ్జెట్ ప్రకటించబడింది.

బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను ప్రోత్సహిస్తూ రామ్‌సర్ సైట్‌ల పరిరక్షణ విలువలను పెంపొందించే దిశగా ఈ పథకం పనిచేస్తుంది. ఇది ఆవాసాల పునరుద్ధరణ, వ్యర్థాల నిర్వహణ మరియు కనీస పర్యావరణ ప్రభావంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ఈ సైట్‌ల చుట్టూ ఉన్న స్థానిక కమ్యూనిటీలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పరిరక్షణ ప్రయత్నాలలో వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు స్థిరమైన పర్యాటకం నుండి ప్రయోజనం పొందడం దీని లక్ష్యం.

ఈ పథకం పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖల సంయుక్త ప్రయత్నం. ఈ పథకం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, అయితే సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్ మరియు చిలికా సరస్సు వంటి పైలట్ ప్రాజెక్ట్‌లలో కనిపిస్తున్న సానుకూల పురోగతి, దీని విజయం ధీమా కల్పిస్తుంది.

ఇది రామ్‌సర్ సైట్‌ల యొక్క మొత్తం పునరుజ్జీవనానికి, బాధ్యతాయుతమైన పర్యాటకులను ఆకర్షించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి మరియు పర్యావరణ నిర్వహణను ప్రోత్సహించడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

అంతరించిపోయే అంచున ఉన్న మాదిక భాష

శతాబ్దాల క్రితం కర్ణాటక నుండి వలస వచ్చిన చాకలియ కమ్యూనిటీ మాట్లాడే మాదిక భాష ప్రస్తుతం అంతరించిపోయే అంచున ఉంది. ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌ ప్రాంతానికి చెందిన 87 ఏళ్ళ కేపీ నారాయణ్, ఆయన మేనకోడలు రాజపుత్రి మాత్రమే ఈ భాషను తెలిసిన వారు ఉన్నారు. లిపి లేని ఈ అరుదైన భాషను యునెస్కో అంతరించిపోయిన భాషగా వర్గీకరించింది. అంతరించిపోతున్న ఈ భాషను డాక్యుమెంట్ చేయడానికి మరియు సంరక్షించడానికి తక్షణ ప్రయత్నాలు మమ్మరం చేసింది.

మధికా అనేది కేరళలోని కన్నూర్‌లో చాకలియ సమాజం మాట్లాడే ఒక ప్రత్యేకమైన భాష. మధిక అనేది వివిధ ద్రావిడ మరియు ఇండో-ఆర్యన్ భాషల మనోహరమైన మిశ్రమం. ఇది కన్నడ నుండి, ముఖ్యంగా హవ్యక కన్నడ మాండలికం నుండి, తెలుగు, తుళు మరియు మలయాళం నుండి కూడా ప్రభావం అయ్యింది. ఈ ప్రత్యేకమైన మిక్స్ మధికాకు దాని ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.

దురదృష్టవశాత్తు, మధికా అనేది ఒక అలిఖిత భాష, ఇది ప్రధానంగా మౌఖిక సంభాషణ ద్వారా తరతరాలుగా సంక్రమించింది. యువ తరాలు ఈ ప్రాంతంలో ఆధిపత్య భాష అయిన మలయాళాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నందున ఇది అంతరించిపోయే ప్రమాదం ఉంది.

భాషావేత్తలు మరియు పరిశోధకులు ఆడియో రికార్డింగ్‌లు మరియు మిగిలిన స్పీకర్లతో ఇంటర్వ్యూల ద్వారా మాదికను డాక్యుమెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు. భావి తరాలకు ఈ భాషను కాపాడేందుకు ఈ డాక్యుమెంటేషన్ కీలకం. చాకలియ కమ్యూనిటీలో మాదికా గురించి అవగాహన పెంచడానికి మరియు భాష నేర్చుకోవడానికి మరియు మాట్లాడేందుకు యువ తరాలను ప్రోత్సహించడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మాన్ సింగ్

ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన రెండవ భారతీయ వ్యక్తిగా మాన్ సింగ్ నిలిచాడు. చైనాలోని హాంకాంగ్‌లో జరిగిన 2024 ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్‌లో 34 ఏళ్ల మాన్ సింగ్ రెండు గంటల 14 నిమిషాల 19 సెకన్లు (2:14:19) పోటీలో గెలుపొంది బంగారు పతకం దక్కించుకున్నాడు. దీనితో ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. ఈ పోటీలో 65 సెకన్ల గణనీయమైన తేడాతో చైనాకు చెందిన రన్నరప్ హువాంగ్ యోంగ్‌జెంగ్‌ను సునాయాసంగా ఓడించాడు.

మాన్ సింగ్ ఇది వరకు పారిస్ ఒలింపిక్స్ యందు నమోదు చేసిన 2:08:10 సెకన్ల ప్రదర్శన అతని అత్యుత్తమం. అతను గతేడాది హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 2:16:59 నిమిషాల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. తాజా పోటీలో చైనాకు చెందిన హువాంగ్ యోంగ్‌జెంగ్ 2:15:24 సెకన్లతో రజతం కైవసం చేసుకోగా, కిర్గిస్థాన్‌కు చెందిన టియాప్‌కిన్ ఇలియా 2:18:18 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ పోరులో మరో భారతీయుడు ఏపీ బెల్లియప్ప 2:20:20తో ఆరో స్థానంలో నిలిచాడు.

హాంకాంగ్‌లో జరిగిన మహిళల మారథాన్ రేసులో  దేశానికి చెందిన అశ్విని మదన్ జాదవ్ 2:56:42 నిమిషాలతో ఎనిమిదో స్థానంలో నిలవగా, జ్యోతి గవాటే 3:06:20 నిమిషాల్లో 11వ ర్యాంక్‌తో ముగించారు. అయితే 2017లో చైనాలోని డోంగ్‌గువాన్‌లో జరిగిన ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు గోపీ తోనకల్, 2:15:48 సెకన్లతో నాడు విజేతగా నిలిచాడు. అలానే ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా ఆశా అగర్వాల్ ఉన్నారు. ఈమె 1985లోనే నిర్వహించిన  తోలి ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్స్‌లోనే విజేతగా నిలిచారు.

ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్‌లు అనేది ఆసియా క్రీడాకారుల కోసం నిర్వహించే  ద్వైవార్షిక రోడ్ రన్నింగ్ మారథాన్ పోటీ. దీనిని ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. వీటిని 1988 నుండి నిర్వహిస్తున్నారు. ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్‌ పోటీలో పూర్తి మారథాన్ (42.195 కిమీ), హాఫ్-మారథాన్ (21.0975 కిమీ), మినీ-మారథాన్ (5.2 కిమీ) అనే నాలుగు ఈవెంట్‌లు ఉంటాయి. ఈ పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన దేశం జపాన్, ఇది తొమ్మిది పురుషుల టైటిల్స్ మరియు నాలుగు మహిళల టైటిల్స్ గెలుచుకుంది.

సాలార్ జంగ్ మ్యూజియంలో ఐదు కొత్త గ్యాలరీలు ప్రారంభం

హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఐదు కొత్త గ్యాలరీలను కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జనవరి 21న ప్రారంభించారు. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మ్యూజియంలలో ఒకటైన సాలార్ జంగ్ మ్యూజియంను అప్‌గ్రేడ్‌ చేసే ప్రక్రియలో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా చేర్చిన ఐదు కొత్త గ్యాలరీలలో ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీ, బిడ్రివేర్ గ్యాలరీ, ది లాంప్ & షాన్‌డిలియర్ గ్యాలరీ, యూరోపియన్ కాంస్య విగ్రహాల గ్యాలరీ మరియు యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ ఉన్నాయి.

  1. ఇండియన్ స్కల్ప్చర్ గ్యాలరీలో కాకతీయుల కాలం నాటి మనోహరమైన "అనంత్సాయన విష్ణువు"తో సహా క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన 40కి పైగా శిల్పాల నిధిని చేర్చారు.
  2. బిడ్రివేర్ గ్యాలరీలో 300 ప్రత్యేకమైన వస్తువులను ఉనికిలోకి తెచ్చారు, ఇందులో సున్నితమైన 'హుక్కా' బేస్‌లు మరియు ప్రత్యేకమైన జగ్‌లు కూడా ఉన్నాయి.
  3. ది లాంప్ & షాన్‌డిలియర్ గ్యాలరీలో వివిధ యుగాలు మరియు శైలులను సూచిస్తూ 180 పురాతన దీపాలను ప్రదర్శనకు ఉంచారు.
  4. యూరోపియన్ కాంస్య విగ్రహాల గ్యాలరీలో ఆ ఖండానికి సంబంధించిన 100 పైగా కాంస్య విగ్రహాలను అందుబాటులో ఉంచారు.
  5. యూరోపియన్ మార్బుల్ గ్యాలరీలో 50 పురాతన మార్బుల్ శిల్పాలు ఉంచారు.

సాలార్ జంగ్ మ్యూజియం, ఇప్పటికే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది, ఈ కొత్త గ్యాలరీల ప్రారంభంతో సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ విస్తరణ హైదరాబాద్ యొక్క సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా భారతదేశం మరియు వెలుపల ఉన్న గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రశంసించడానికి ఒక విలువైన వేదికను అందిస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత శిల్పి డాక్టర్‌ ఎ యాదగిరిరావు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసెర్చ్‌ మాజీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వై సుదర్శన్‌రావు, సీనియర్‌ ఐఐఎస్‌ అధికారి, నేషనల్‌ మ్యూజియంల అదనపు డీజీ ఆశిష్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలోని ప్రముఖ జాతీయ మ్యూజియంలలో ఒకటి. ఇది హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున ఉన్న దార్-ఉల్-షిఫా వద్ద ఉన్న ఒక ఆర్ట్ మ్యూజియం. 1951న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దివాన్ డియోడిలో ప్రారంభించారు. నిజానికి ఇది 1720 నుండి 1948 వరకు పాలించిన నిజాం రాజా కుటుంబం అయినా సాలార్ జంగ్ కుటుంబం సేకరించిన వస్తువుల సేకరణ. సాలార్ జంగ్ III మరణం తర్వాత ఇవి దేశానికి అందించబడ్డాయి.

సాలార్ జంగ్ మ్యూజియం జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, యూరప్ మరియు ఉత్తర అమెరికాకు చెందిన విలువైన శిల్పాలు, పెయింటింగ్‌లు, వస్త్రాలు, మాన్యుస్క్రిప్ట్‌లు, సిరామిక్స్ , మెటాలిక్ కళాఖండాలు, తివాచీలు , గడియారాలు మరియు ఫర్నిచర్‌ల వంటి 1.1 మిలియన్ వస్తువుల సేకరణను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటి. ఇది భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది.

Post Comment