Advertisement
30th డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ | Today Current affairs in Telugu
Telugu Current Affairs

30th డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ | Today Current affairs in Telugu

30th December 2023 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ విలీనానికి ఆర్‌బిఐ ఆమోదం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బ్యాంకింగ్ అనుబంధ సంస్థ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌తో ఐడిఎఫ్‌సి లిమిటెడ్ రివర్స్ విలీనానికి డిసెంబర్ 26న ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై 3న ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మరియు ఐడిఎఫ్‌సి లిమిటెడ్‌లు ఈ విలీన పథకాన్ని ప్రతిపాదించాయి. ఆర్‌బిఐ ఆమోదం తెలిపినప్పటికీ, విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) మరియు సంబంధిత కంపెనీల వాటాదారులు మరియు రుణదాతల ఆమోదం పొందాల్సి ఉంటుంది.

ఐడిఎఫ్‌సి లిమిటెడ్ 1997లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ డొమెస్టిక్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌గా ఏర్పాటు చేయబడింది. ఏప్రిల్ 2014లో ఐడిఎఫ్‌సి బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్‌బిఐ నుండి సూత్రప్రాయ ఆమోదం పొందింది, ఇది ఐడిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్‌ను సృష్టించడానికి దారితీసింది. ఈ బ్యాంక్ అక్టోబర్ 2015లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. తర్వాత కాలంలో ఐడిఎఫ్‌సి లిమిటెడ్ యొక్క రుణ ఆస్తులు, అప్పులు, మౌలిక సదుపాయాలు మరియు కార్పొరేట్ రుణాలు ఐడిఎఫ్‌సి బ్యాంక్‌కి బదిలీ చేయబడ్డాయి.

2018లో ఐడిఎఫ్‌సి బ్యాంక్ మరియు క్యాపిటల్ ఫస్ట్ విలీనమయ్యాయి. దీని తర్వాత ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌గా పేరు  మార్చుకున్నాయి. జూన్ 30, 2023 నాటికి, ఐడిఎఫ్‌సి లిమిటెడ్ తన నాన్-ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ ద్వారా ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో 39.93% వాటాను కలిగి ఉంది. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ గత నాలుగు సంవత్సరాలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ నుండి యూనివర్సల్ బ్యాంకింగ్ ఫ్రాంచైజీగా రూపాంతరం చెందడంతో ఈ విలీన ప్రక్రియకు తీసింది.

విలీనం పూర్తయిన తర్వాత, మిశ్రమ సంస్థ ఆస్తులు మరియు అప్పుల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోతో పెద్ద మరియు బలమైన బ్యాంక్‌గా మారుతుంది. ఇది విస్తృత కస్టమర్ బేస్ మరియు బలమైన బ్యాలెన్స్ షీట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఒక బలమైన మరియు మరింత పోటీతత్వ బ్యాంక్‌ను సృష్టిస్తుందని భావిస్తున్నారు, ఇది కస్టమర్‌లు మరియు వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

భారత్‌ బ్రాండ్‌తో కిలో బియ్యం 25 రూపాయలకు

భారత్ బ్రాండ్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నాణ్యమైన బియ్యాన్ని కిలో 25 రూపాయలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే కాలంలో దేశంలో బియ్యం ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, 2024 సాధారణ ఎన్నికలకు ముందు ప్రబుత్వంకు ఆందోళనలను పెంచుతుంది. ఈ చొరవ బియ్యం లభ్యతను పెంచడంతో పాటుగా ధరలను స్థిరీకరించగలదని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఈ ప్రతిపాదిత బియ్యానికి తగ్గింపు రేటును ఇంకా నిర్ణయించలేదని ఆహార మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద ఇ-వేలం ద్వారా ఎఫ్‌సిఐ బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా రిటైల్ బియ్యం ధరలను నియంత్రించడానికి మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలకు ఇంకా సానుకూల స్పందన రాలేదు. భారత్‌ బియ్యంను  రిటైల్‌ చేసే ప్రతిపాదన ఉందని, అయితే ధర ఇంకా నిర్ణయించలేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ కింద నాణ్యమైన బియ్యాన్ని కిలోకు రూ. 29 రిజర్వ్ ధరకు అందిస్తుంది. అయితే భారత్ బియ్యాన్ని అదే రేటుకు లేదా తక్కువ ధరకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ మరియు కేంద్రీయ భండార్ నిర్వహించే అవుట్‌లెట్‌ల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి (ఆటా) మరియు పప్పులను భారత్ బ్రాండ్‌తో తక్కువ ధరకు విక్రయిస్తోంది.

అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

నూతనంగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ప్రారంభించారు. అయోధ్యలో అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న రామాయణ పురాణ రచయిత మహర్షి వాల్మీకి పేరు మీద ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు.

ఈ అత్యాధునిక విమానాశ్రయం యొక్క మొదటి దశ 1450 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయబడింది. విమానాశ్రయం యొక్క టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించే సామర్థ్యం కలిగిఉంది. ఈ టెర్మినల్ భవనం యొక్క ముఖభాగం అయోధ్యలో రాబోయే శ్రీరామ మందిరం యొక్క ఆలయ నిర్మాణాన్ని పోలిఉంది. టెర్మినల్ బిల్డింగ్ లోపలి భాగాలను భగవాన్ శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే స్థానిక కళ, పెయింటింగ్‌లు & కుడ్యచిత్రాలతో అలంకరించారు.

అయోధ్య విమానాశ్రయం యొక్క టెర్మినల్ భవనం ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్‌ఈడీ లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్ వంటి అత్యాధునిక సదుపాయాలతో రూపొందించబడింది. వచ్చే జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరం కొచ్చే భక్తుల కోసం దీనిని కొత్తగా అభివృద్ధి చేసారు. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపర్చడంతో పాటుగా పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలు మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

ఇండియన్ ఆయిల్ తదుపరి డైరెక్టర్ (హెచ్‌ఆర్)గా రష్మీ గోవిల్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ రష్మీ గోవిల్, ప్రభుత్వ యాజమాన్య సంస్థ యొక్క తదుపరి డైరెక్టర్ (హెచ్‌ఆర్)గా నియమితులయ్యారు. డిసెంబర్ 28న జరిగిన పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఇఎస్‌బి) ప్యానెల్ తన ఎంపిక సమావేశంలో ఇంటర్వ్యూ చేసిన 11 మంది అభ్యర్థుల జాబితా నుండి ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ పదవికి గోవిల్ సిఫార్సు చేయబడింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని భారతీయ చమురు మరియు గ్యాస్ కంపెనీ. ఇండియన్ ఆయిల్ 2022 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేషన్‌ల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 94వ స్థానంలో ఉంది. ఇది దేశంలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు ఉత్పత్తిదారులలో ఒకటి. దీనిని 1958లో ఇండియన్ రిఫైనరీస్ లిమిటెడ్ పేరుతొ స్థాపించారు. 1959లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌గా పేరు మార్చుకుంది.

చైనా కొత్త రక్షణ మంత్రిగా డాంగ్ జున్‌

చైనా నావికాదళ మాజీ కమాండర్ డాంగ్ జున్‌ను రక్షణ మంత్రిగా నియమించింది. ఈ ఏడాది ఆగస్టు నుండి మునపటి రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు అదృశ్యం కావడంతో ఆయన స్థానంలో డాంగ్ జున్‌ను నియమించింది. డిసెంబర్ 29న బీజింగ్‌లో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మిస్టర్ డాంగ్ నియామకాన్ని చైనా అగ్ర శాసనసభ్యులు ప్రకటించారు.

డాంగ్ జున్‌ ఆగస్టు 2021లో నౌకాదళ కమాండర్‌గా నియమితులయ్యారు. దీనికి ముందు చైనీస్ మిలిటరీ యొక్క సదరన్ థియేటర్ కమాండ్‌కు డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. ఇది అత్యంత వివాదాస్పద ప్రాంతమైన దక్షిణ చైనా సముద్రంలో ఉంది. చైనాచే  క్లెయిమ్ చేయబడిన ఈ ప్రాంతం పొరుగున ఉన్న ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్, బ్రూనై మరియు మలేషియాల ఆగ్రహానికి దారితీసింది. వచ్చే నెలలో తైవాన్ యందు జరగనున్న అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ఆ దేశంపై చైనా ఇప్పటికే సైనిక ఒత్తిడిని పెంచుతుంది.

అయితే డాంగ్ జున్ చైనా సాయుధ దళాలపై ప్రత్యక్ష నియంత్రణను కలిగి ఉండరు. సాయుధ దళాల మొత్తం అధికారం అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ చేతిలో ఉంటుంది, అతను సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు కూడా అధ్యక్షత వహిస్తాడు. అయితే డాంగ్ జున్‌ చైనీస్ నావికాదళానికి అధిపతిగా పని చేయడంతో. దక్షిణ చైనా సముద్రంలో ఆయనుకు ఉన్న విస్తృతమైన అనుభవం ఉపయోగపడుతుంది, డాంగ్ జున్‌ నమ్మకమైన మరియు అనుభవజ్ఞుడైన అధికారిగా పేరు పొందాడు. అతని నియామకం చైనా సైన్యంలో ఇటీవలి షేక్-అప్ గురించి వచ్చిన ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ప్రపంచ రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారునిగా భారతదేశం

భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారునిగా అవతరించినట్లు కేంద్ర ఉక్కు & పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా వెల్లడించారు. ఉక్కు రంగంపై దృష్టి సారించిన "సేవ, సుశాసన్ మరియు గరీబ్ కళ్యాణ్" యొక్క 9-సంవత్సరాల థీమ్‌పై ఆయన మాట్లాడారు. గత 9 సంవత్సరాలలో 6.02 మెట్రిక్ టన్నుల దిగుమతికి బదులుగా 6.72 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం ఉక్కు యొక్క నికర ఎగుమతిదారునిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

బ్రాండ్ ఇండియా లేబులింగుతో ఇండియా నాణ్యతమైన ఉక్కును తయారు చేస్తుందని, దేశంలో ఉత్పత్తి అయ్యే ఉక్కుకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్‌ను ఉక్కు మంత్రిత్వ శాఖ చేపట్టిందని వెల్లడించారు. ఇందులో భాగంగా పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద 22 క్లిష్టమైన మౌలిక సదుపాయాల అంతరాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖతో కలిసి దీనిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఉక్కు రంగంలో డీకార్బనైజేషన్‌ను ప్రోత్సహించేందుకు, గ్రీన్ స్టీల్ ఉత్పత్తికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన యాక్షన్ పాయింట్‌లను గుర్తించేందుకు మంత్రిత్వ శాఖ ఇప్పటికే 13 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసిందని మరియు ఉక్కు పరిశ్రమ మరియు ఇతర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల వాటాదారులతో నిరంతరం చర్చలు జరుపుతోందని మంత్రి పేర్కొన్నారు.

2023లో 90.8 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో చైనా అగ్రస్థానంలో ఉండగా, 14.3% వృద్ధితో 11.5 మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి భారత్ రెండవ స్థానంలో ఉంది. జపాన్ 0.9% వృద్ధితో 7.4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మూడవ స్థానంలో, యునైటెడ్ స్టేట్స్ 0.5% వృద్ధితో 6.9 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో నాల్గొవ స్థానంలో ఉన్నాయి.

Post Comment